ACs, Refrigerators: బీఈఈ కొత్త నిబంధనలు.. 10 శాతం పెరగనున్న ACలు, రిఫ్రిజిరేటర్ల ధరలు
- బీఈఈ కొత్త నిబంధనలు
- 10 శాతం పెరగనున్న ACలు, రిఫ్రిజిరేటర్ల ధరలు
- జనవరి 1 నుంచి 5 నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త సంవత్సరం ప్రారంభమైన వెంటనే గృహోపకరణాల కొనుగోలుదారులకు చేదు వార్త. రూమ్ ఎయిర్ కండిషనర్లు (ఏసీలు), రిఫ్రిజిరేటర్ల ధరలు జనవరి 1 నుంచి 5 నుంచి 10 శాతం వరకు పెరగనున్నాయి. ఇందుకు ప్రధాన కారణం బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE) తీసుకొచ్చిన కొత్త స్టార్ రేటింగ్ నిబంధనలు. BEE కొత్త ఎనర్జీ ఎఫిషియన్సీ నియమాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో తయారీదారులు మరింత సామర్థ్యవంతమైన భాగాలను ఉపయోగించాల్సి రావడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి. ఫలితంగా ఈ ధరల పెంపు అనివార్యమైంది.
Also Read:Revanth Reddy: కేసీఆర్ పెట్టిన సంతకం ఏపీకి అడ్వాంటేజ్.. కృష్ణా జలాల్లో తెలంగాణకు 71 శాతం రావాలి!
Also Read
- Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
- RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
- Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
- AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
బ్లూ స్టార్ మేనేజింగ్ డైరెక్టర్ బీ. త్యాగరాజన్ మాట్లాడుతూ, “కొత్త నిబంధనల ప్రకారం 5-స్టార్ ఏసీ 10 శాతం మెరుగైన ఎనర్జీ సామర్థ్యం కలిగి ఉంటుంది, కానీ దాని ధర కూడా సుమారు 10 శాతం పెరుగుతుంది” అని తెలిపారు. 2025లో 5-స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు 2026 నిబంధనల ప్రకారం 4-స్టార్గా డౌన్గ్రేడ్ అవుతాయి. అలాగే పాత 4-స్టార్ మోడల్స్ 3-స్టార్గా, 3-స్టార్ మోడల్స్ 2-స్టార్గా మారతాయి. కొత్త 5-స్టార్ మోడల్స్ ప్రస్తుతం 6 లేదా 7-స్టార్ స్థాయి సామర్థ్యం కలిగి ఉంటాయి.
వోల్టాస్, డైకిన్, బ్లూ స్టార్, గోద్రెజ్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ మార్పులను సమర్థిస్తున్నాయి. ఈ నిబంధనల వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి, దీర్ఘకాలంలో విద్యుత్ బిల్లులు తగ్గుతాయని వారు అంటున్నారు. అయితే గోద్రెజ్ అప్లయెన్సెస్ వంటి కొన్ని కంపెనీలు 3-5 శాతం మాత్రమే పెంచుతామని, ఏసీలకు 5-7 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నాయి.
Also Read:Space events in 2026: న్యూ ఇయర్లో తప్పక చూడాల్సిన 5 అంతరిక్ష అద్భుతాలు ఇవే..
సెప్టెంబర్లో ఏసీలపై GSTను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించడంతో ధరలు 10 శాతం వరకు తగ్గాయి. కానీ ఈ కొత్త BEE నిబంధనల వల్ల ఆ ప్రయోజనం దాదాపు పోతుంది. అదనంగా రూపాయి మారకం బలహీనత, కాపర్ వంటి ముడి పదార్థాల ధరల పెరుగుదల కూడా ధరలను పెంచాయి. జనవరి 1 నుంచి రిఫ్రిజిరేటర్లు, టీవీలు, ఎల్పీజీ గ్యాస్ స్టవ్లు, కూలింగ్ టవర్లు, చిల్లర్లు వంటి ఉపకరణాలకు స్టార్ లేబులింగ్ తప్పనిసరి అయింది. ఇది వినియోగదారులకు మెరుగైన ఎంపికలు అందిస్తుంది. మొత్తంగా ఈ మార్పులు పర్యావరణానికి మేలు చేస్తాయి కానీ తక్షణం వినియోగదారుల జేబుపై భారం పడనుంది.
తాజావార్తలు
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
-
Kia Syros Flex Fuel: 100% ఇథనాల్తోనూ నడుస్తుంది.. కియా సైరస్ ఫ్లెక్స్-ఫ్యూయల్ వచ్చేసింది..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!