Mumbai teacher bail: విద్యార్థిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో అరెస్టయిన ముంబైలోని ప్రముఖ పాఠశాలకు చెందిన 40 ఏళ్ల ఉపాధ్యాయురాలికి బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక పోక్సో కోర్టు వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. బాధిత విద్యార్థి వయస్సు 17 ఏళ్లు పైబడి ఉందని ప్రత్యేక న్యాయమూర్తి సబీనా ఎ మాలిక్ తెలిపారు. “ఈ కేసులో నిందితురాలు, 40 ఏళ్ల మహిళా టీచర్ పాఠశాలకు రాజీనామా చేసింది. దీంతో ఆమెకు విద్యార్థితో సంబంధం ఇక లేదు. విద్యార్థిపై ప్రభావం తగ్గిపోయింది.” అని న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణ ప్రారంభం కావడానికి సమయం పడుతుందని, ఈలోగా నిందితురాలిని జైలులో ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
READ MORE: Chitrapuri Colony: చిత్రపురి కాలనీపై సందేహాలున్న వారంతా మీటింగుకు రండి !
బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ.. ఆ 17 ఏళ్ల బాలుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ మహిళను బెయిల్పై విడుదల చేస్తే, మరోసారి ఆ విద్యార్థి ప్రాణానికి హాని కలిగించే అవకాశం ఉందని.. బెదిరింపులకు పాల్పడవచ్చని పేర్కొన్నారు. సాక్ష్యాలను కూడా తారుమారు చేస్తుందని వాదించారు. అయితే.. ఈ అంశంపై న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ వాదనలో బెయిల్ రద్దు చేయడం సరికాదని కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. నిందితురాలు బాధితుడిని ఏ విధంగానూ సంప్రదించకూడదు. బెదిరింపులకు పాల్పడకూడదని షరతులు విధించారు. ఈ షరతులను ఉల్లంఘిస్తే తక్షణ బెయిల్ రద్దు చేయబడుతుందని న్యాయమూర్తి అన్నారు.
READ MORE: India-UK trade deal: భారత్-యూకేల మధ్య కుదిరిన అతిపెద్ద ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’’
అసలు కేసు ఏంటి..?
ముంబైలోని ఒక ప్రముఖ పాఠశాలకు చెందిన 40 ఏళ్ల ఇంగ్లీష్ టీచర్ తన 17 ఏళ్ల విద్యార్థిపై ఏడాది పాటు లైంగిక వేధింపులకు పాల్పడింది. ఈ ఆరోపణలపై గతంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళ మైనర్ బాలుడిని ముంబైలోని వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లు, ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి, మద్యం తాగించేదని తేలింది. నిరోధక మాత్రలు సైతం ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడిందని బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి ప్రవర్తనలో మార్పును గమనించిన కుటుంబీకులు ఆరా తీయగా.. ఈ విషయం బయటపడింది. జరిగిన విషయాన్ని ఆ బాలుడు కుటుంబీకులకు తెలియజేయడంతో వాళ్లు ఆ టీచర్పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో షాకింగ్ వివరాలు బయటకు వచ్చాయి.
పోలీసు ఫిర్యాదు ప్రకారం.. డిసెంబర్ 2023లో పాఠశాల వార్షికోత్సవం కోసం డ్యాన్స్ గ్రూపులకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెళ్లయి, పిల్లలు ఉన్న 40 ఏళ్ల మహిళా టీచర్ ఆ 17 ఏళ్ల అబ్బాయిని చూసింది. అతడి పట్ల ఆకర్షితురాలైంది. ఆమె ఒక నెల తర్వాత ఆ బాలుడిపై మొదటి సారి లైంగిక దాడికి పాల్పడింది. ఆ అబ్బాయి మొదట్లో అయిష్టంగానే టీచర్ నుంచి తప్పించుకోవడం మొదలుపెట్టాడు. అయితే, ఈ రోజుల్లో ఇవన్నీ సాధారణం అయ్యాయని చెప్పి ఓ మహిళా స్నేహితురాలు ఆ బాలుడిని ఒప్పించింది. దీంతో ఆ 17 ఏళ్ల విద్యార్థి ఒప్పుకున్నాడు. కాగా.. ఎలాగైనా ఆ బాలుడిని ఒప్పించి తన వద్దకు పంపించాలని టీచర్ ఆ మహిళా స్నేహితురాలిని ఉసిగొలిపింది. ఇలా చెప్పి ఒప్పించిన అబ్బాయి స్నేహితులిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
READ MORE: India-UK trade deal: భారత్-యూకేల మధ్య కుదిరిన అతిపెద్ద ‘‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం’’
బాలుడిని ఆమె తన కారులో ఎక్కించుకుని, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా బట్టలు విప్పి లైంగికంగా వేధించింది. ఖరీదైన హోటళ్లకు తీసుకెళ్లడంతో ఆ విద్యార్థి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. టీచర్ తరచుగా బాలుడికి మద్యం తాగించి, అతనిపై దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ అబ్బాయి ఆందోళనకు గురైతే… ఆందోళన నిరోధక మందులు(యాంటీ యాంగ్జైటీ మందులు) కూడా ఇచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందంతా తెలిసిన బాలుడి పేరెంట్స్ మొదట ఆమెను హెచ్చరించారు. అయినా వినిపించుకోకుండా రెండో సారి సైతం బాలుడిని సంప్రదించడంతో విషయం బయటకు వచ్చింది.
