PM Modi: సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. హఠాహత్తుగా ఆయనకు ఆరోగ్యం సీరియస్ కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనకు స్కానింగ్లు నిర్వహించి.. డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
ప్రధాని మోడీ సద్గురుకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సద్గురుతో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని తెలిపారు. మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని మోడీ ఆకాంక్షించారు.
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆస్పత్రిలో చేరిన ఆయనకు అదేరోజు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ తెలిపింది. అలాగే ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించారు. అత్యంత వేగంగా కోలుకుంటున్నారని డాక్టర్లు కూడా వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా సద్గురు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. వైద్యులు టెస్టులు చేయగా.. ఆయనకు మెదడులో భారీ రక్తస్రావం, మరియు వాపు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బ్రెయిన్కు శస్త్ర చికిత్స నిర్వహించారు.
సద్గురు మెదడులో ప్రాణాంతక పరిస్థితి ఉందని అపోలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. CT స్కాన్ తర్వాత మెదడులో తీవ్రమైన వాపును గుర్తించినట్లు వెల్లడించారు. రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో సద్గురు నొప్పిని పట్టించుకోలేదని తెలుస్తోంది. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతోనే సద్గురు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే సద్గురు బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు.
ప్రస్తుతం సద్గురు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. అన్ని అవయవాలు పని చేస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఊహించిన దాని కంటే ఎక్కువగా సద్గురు కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం సద్గురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో సమావేశాలు, సమ్మేళనానికి హాజరయ్యేందుకు సద్గురు వచ్చారు. హస్తినకు చేరుకున్నాక ఈ పరిస్థితులు తలెత్తాయి.
తాజావార్తలు
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
-
Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
-
Air Conditioner: ఏసీని ఈ ఉష్ణోగ్రతలో పెడితే కరెంట్ బిల్లు తగ్గుతుందా? చాలామందికి తెలియని నిజాలు
-
Polavaram Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. గండి పోశమ్మ మార్గంలో అప్రమత్తం!
-
Prabhas : ‘స్పిరిట్’ పవర్ఫుల్ డైలాగ్ లీక్? థియేటర్స్ షేక్ అవడం గ్యారెంటీ
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!