PM Modi: సద్గురు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. హఠాహత్తుగా ఆయనకు ఆరోగ్యం సీరియస్ కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనకు స్కానింగ్లు నిర్వహించి.. డాక్టర్లు బ్రెయిన్ సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.
ప్రధాని మోడీ సద్గురుకు ఫోన్ చేసి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. అనంతరం త్వరగా కోలుకోవాలంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. సద్గురుతో ఫోన్లో మాట్లాడినట్లు ప్రధాని తెలిపారు. మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని మోడీ ఆకాంక్షించారు.
Also Read
- Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
మెదడులో బ్లీడింగ్ కావడంతో ఈ నెల 17న ఆస్పత్రిలో చేరిన ఆయనకు అదేరోజు సర్జరీ చేశారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకుంటున్నారని ఈషా ఫౌండేషన్ తెలిపింది. అలాగే ఆయనకు వెంటిలేటర్ కూడా తొలగించారు. అత్యంత వేగంగా కోలుకుంటున్నారని డాక్టర్లు కూడా వెల్లడించారు.

గత కొద్ది రోజులుగా సద్గురు విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. వైద్యులు టెస్టులు చేయగా.. ఆయనకు మెదడులో భారీ రక్తస్రావం, మరియు వాపు ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బ్రెయిన్కు శస్త్ర చికిత్స నిర్వహించారు.
సద్గురు మెదడులో ప్రాణాంతక పరిస్థితి ఉందని అపోలో సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ వినిత్ సూరి తెలిపారు. CT స్కాన్ తర్వాత మెదడులో తీవ్రమైన వాపును గుర్తించినట్లు వెల్లడించారు. రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో సద్గురు నొప్పిని పట్టించుకోలేదని తెలుస్తోంది. నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతోనే సద్గురు ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే సద్గురు బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నారు.
ప్రస్తుతం సద్గురు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. అన్ని అవయవాలు పని చేస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఊహించిన దాని కంటే ఎక్కువగా సద్గురు కోలుకుంటున్నారని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం సద్గురు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీలో సమావేశాలు, సమ్మేళనానికి హాజరయ్యేందుకు సద్గురు వచ్చారు. హస్తినకు చేరుకున్నాక ఈ పరిస్థితులు తలెత్తాయి.
తాజావార్తలు
-
Sujeeth: సైలెంట్గా పని కానిచ్చేస్తున్న స్టార్ డైరెక్టర్..
-
Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!