NTV Telugu Site icon

PM Modi: మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళులు

Gandhi Jayanthi 2024

Gandhi Jayanthi 2024

PM Modi: భారత స్వాతంత్య్ర ఉద్యమంలో అత్యంత ప్రముఖుడైన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఆయనకు నివాళులర్పించారు.”బాపు జీవితం, సత్యం, సామరస్యం, సమానత్వంపై ఆధారపడిన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయి.” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. జాతిపితగా కీర్తించబడిన మహాత్మా గాంధీ సత్యం, అహింస సూత్రాలను దృఢంగా అనుసరించారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తరాల రాజకీయ నాయకులు, కార్యకర్తలను ప్రేరేపించారని మోడీ పేర్కొన్నారు.

Read Also: Prashant Kishor: నేడు పీకే పార్టీ ప్రారంభం.. పార్టీ కీలక అంశాలు, ఎజెండా.?

భారతదేశ రెండవ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి కూడా ప్రధాని మోడీ నివాళులర్పించారు. లాల్ బహదూర్ శాస్త్రి తన జీవితాన్ని దేశ సైనికులు, రైతులు, ప్రజల కోసం అంకితం చేశారని “జై జవాన్, జై కిసాన్” నినాదాన్ని లేవనెత్తిన శాస్త్రి గురించి ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. శాస్త్రి సరళత, నిజాయితీ ఆయనకు విస్తృత గౌరవాన్ని సంపాదించిపెట్టాయన్నారు.

ప్రధాని మోడీతో పాటు పలువురు ప్రముఖులు రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, తదితరులు మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు.