Site icon NTV Telugu

PM Modi: అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ కాన్ఫరెన్స్.. పశ్చిమాసియా పరిణామాలపై చర్చ

Modi5

Modi5

ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీ అయ్యారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన సంక్షోభంపై ముఖ్యమంత్రులతో చర్చిస్తున్నారు. కోవిడ్ సమయంలో ఎదురైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నట్లుగానే.. ఇప్పుడు కూడా ఐక్యంగా ఎదుర్కోవాలని సూచించనున్నారు. గ్యాస్, పెట్రోల్‌ సమస్యను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వివరించనున్నారు.

ఇది కూడా చదవండి: Yogi Adityanath: సీఎం యోగికి ఐదేళ్ల బాలిక గిఫ్ట్.. ఏమిచ్చిందంటే..!

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమై 28 రోజులైంది. ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా స్థిరంగా ఉండేలా చూసేందుకు భారతదేశం సన్నద్ధమవుతోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడం వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఈ చర్యలు అమలు జరిగేలా చూడటంలో రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల సరఫరా పటిష్టంగా ఉండేలా చూసేందుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులకు మోడీ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అస్సాంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు.

ఇది కూడా చదవండి: Iran-Hormuz: హార్ముజ్‌పై ఇరాన్ సంచలన నిర్ణయం.. కొత్త టెన్షన్ మొదలైనట్లేనా?

Exit mobile version