NTV Telugu Site icon

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో పెరగనున్న రాజకీయ వేడి.. మూడు రోజుల పాటు మోడీ – అమిత్ షా ర్యాలీలు

Amit Shah And Modi

Amit Shah And Modi

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ లోక్‌సభ నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర మీడియా కో-ఇంఛార్జి అనురాగ్ అగర్వాల్ తెలిపారు. ఏప్రిల్ 23, 24 తేదీల్లో సుర్గుజా, మహాసముంద్, జంజ్‌గిర్-చంపా లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారని చెప్పారు. రెండో దశలో ఏప్రిల్ 26న రాజ్‌నంద్‌గావ్, మహాసముంద్, కాంకేర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Read Also:Kalki 2898 AD : అశ్వత్థామగా అమితాబచ్చన్.. సర్ ప్రైజ్ అదిరిందిగా..

అమిత్ షా ఆదివారం సాయంత్రం రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయానికి చేరుకున్నారు. బిజెపి రాష్ట్ర శాఖ ప్రధాన కార్యాలయంలో పార్టీ సీనియర్ నేతల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఏప్రిల్ 23, 24 తేదీల్లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో పాటు ఎన్నికల సన్నాహాలను కూడా షా పరిశీలించారని అనురాగ్ అగర్వాల్ తెలిపారు. కాంకేర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి బీరేష్‌ ఠాకూర్‌పై భోజరాజ్‌ నాగ్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టింది.

Read Also:Election Campaign Material Market : ఎన్నికల ప్రచారంలో డిజిటల్ హోరు.. మందగించిన ప్రచార సామగ్రి మార్కెట్