Site icon NTV Telugu

Phone Tapping : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో సిట్‌ దర్యాప్తు స్పీడప్‌

Phone Tapping Case

Phone Tapping Case

Phone Tapping : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) దర్యాప్తు మరింత వేగంగా సాగుతోంది. ఇప్పటికే అనేకమంది అధికారులను విచారించిన సిట్, ఈ కేసులో కీలకంగా భావిస్తున్న మాజీ ఎస్‌ఆర్ఎస్ అధికారి ప్రణీతరావు, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావులను విచారణకు పిలిచింది. రేపు ప్రణీతరావు, ఎల్లుండి ప్రభాకర్ రావు హాజరుకావాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అత్యంత సంచలనంగా మారిన అంశం.. రెండు టెరాబైట్ల హార్డ్ డిస్క్‌ల ధ్వంసం వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన కీలకమైన డేటా ఉన్న ఈ హార్డ్ డిస్క్లను ప్రణీతరావే ధ్వంసం చేశారని సిట్ అనుమానిస్తోంది. ఆమె ఈ హార్డ్ డిస్క్లను నాశనం చేసి, వాటిని మూసీ నదిలో పడేసినట్లు ఆధారాలు లభించాయి. విచారణలో ఆమెకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Flying Buses: ఢిల్లీ, బెంగళూరులో ట్రాఫిక్ సమస్య.. ఎగిరే బస్సులకు కేంద్రం ప్లాన్..

అలాగే, ఈ చర్య వెనుక ప్రభాకర్ రావు ప్రమేయం ఉందని సిట్ అనుమానిస్తోంది. అయితే, ప్రభాకర్ రావు మాత్రం తాను పదవి నుంచి రాజీనామా చేసి వెళ్లిపోయిన తరువాతే హార్డ్ డిస్కల ధ్వంసం జరిగిందని చెబుతున్నారు. వీరి మధ్య ఎదురు ఆరోపణలు, వివరణలతో కేసు మరింత మలుపు తిరిగింది. ఇప్పుడు దర్యాప్తు అధికారుల దృష్టి మూడు కీలక అంశాలపై ఉంది.. హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయాలని ఆదేశించినది ఎవరు? ఈ నిర్ణయం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ధ్వంసమైన డేటాలో ఏమి ఉండేది? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే, ఈ కేసు వెలుగు చూసే విధానం పూర్తిగా మారే అవకాశం ఉంది.

Harish Rao : ఇది మార్పా రేవంత్ గారు..? హరీష్‌ రావు సెటైర్లు

Exit mobile version