Site icon NTV Telugu

Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన

Rgi

Rgi

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంకా రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లవలసిన 150 మంది ప్రయాణికులు ఫ్లైట్ ఆలస్యం కావడంతో అధికారులపై మండిపడ్డారు. ప్రయాణికులకు అధికారులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ నుంచి ఫ్లైట్ రాకముందే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారని గొడవపడ్డారు. ఫ్లైట్ ఆలస్యానికి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి వెయిట్ చేయించడం ఎందుకని అధికారులను ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version