Telangana Bandh: ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్!
- నేడు తెలంగాణ బంద్
- బంద్కు పిలుపునిచ్చిన ఓయూ జేఏసీ
- బంద్కు ప్రధాన కారణం మోండా మార్కెట్ ఘటనే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OU JAC Calls Telangana Bandh Today Due To Go Back Marwadi Protest: నేడు (ఆగస్టు 22) తెలంగాణ బంద్కు ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణలోని స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓయూ జేఏసీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు ఇప్పటికే కొన్ని వర్తక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. అలానే తెలంగాణలోని కొన్ని జిల్లాలు బంద్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.
తెలంగాణ బంద్కు ప్రధాన కారణం మోండా మార్కెట్ ఘటనే. తాజాగా మోండా మార్కెట్లో మార్వాడీ వ్యాపారులు ఓ దళితుడిపై దాడి చేశారు. ఈ ఘటనను ఓయూ జేఏసీ ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా ఖండించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే.. ఇప్పుడు మార్వాడీలు స్థానిక ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా.. స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోండా మార్కెట్ ఘటనను ఖండిస్తూ.. ఓయూ జేఏసీ నేడు బందుకు పిలుపునిచ్చింది. ప్రజలందరూ దీనికి మద్దతిచ్చి బంద్ను విజయవంతం చేయాలని కోరారు.
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
Also Read: Horoscope Today: శుక్రవారం దినఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగం పక్కా!
మార్వాడీలు నాసిరకం సామగ్రిని తక్కువ ధరకు అమ్ముతూ.. కస్టమర్లను, లోకల్ వ్యాపారస్థులను నష్టపరుస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో స్థానిక వ్యాపారాలకు మాత్రమే కాకూండా.. ఉపాధికి కూడా మార్వాడీల నుంచి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం రాజకీయంగా కూడా ఉద్రిక్తంగా మారింది. కొందరు ఈ ఉద్యమంకు మద్దతిస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్లు మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నారు. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మద్దతిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!