Bullet Baba Temple: ఈ గుడిలో ఆశ్చర్యకరమైన దేవుడు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bullet Baba Temple: దేవుడు సర్వాంతర్యామి.. విశ్వాసం అనేది ఒక వ్యక్తిని దేవుడిని వెతకడానికి ప్రేరేపిస్తుంది. రాజస్థాన్లో ఉన్న ఒక ఆలయంలో కొలువుదీరిన దేవుడిని చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.. ఈ ఆలయంలో రాళ్లు లేదా విగ్రహాలను కాకుండా బుల్లెట్ బైక్లను పూజిస్తారు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆలయాన్ని ఓం బన్నా ఆలయం అంటారు. దీనిని “బుల్లెట్ బాబా ఆలయం” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Madanapalle Kidney Racket: మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు.. ఒక్కో కిడ్నీ పాతిక లక్షలకు
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
పాలి-జోధ్పూర్ హైవే సమీపంలో ఆలయం..
ఈ ఆలయం పాలి-జోధ్పూర్ హైవే సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన ఎవరైనా రోడ్డు ప్రమాదాల నుంచి విముక్తి పొందుతారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడ బుల్లెట్ బైక్ను పూజించడమే కాకుండా, మద్యం, కొబ్బరికాయలు, పువ్వులను నైవేద్యంగా పెడతారు. ఆలయం కథలోకి వెళ్తే.. ఓం బన్నా ఆలయం వెనుక ఒక బుల్లెట్ బైక్ పార్క్ చేసి ఉంది. దాని నంబర్ RNJ 7773. ఇక్కడి ప్రజలు దానికి పూలు, కొబ్బరికాయలు, మద్యం, డబ్బులను కానుకలుగా సమర్పిస్తారు. ఈ బుల్లెట్ బైక్ను ఒకప్పుడు ఓం బన్నా అనే వ్యక్తి నడిపాడని, అతను రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెబుతారు. ఓం బన్నా కూడా ఇదే బైక్ను నడుపుతున్నాడని చెబుతారు. ప్రమాదం తర్వాత, పోలీసులు బుల్లెట్ బైక్ను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు, కానీ ఆ బైక్ ప్రతిరోజూ ఓం బన్నా మరణించిన అదే ప్రదేశానికి వెళుతూనే ఉంది.
అలా ఆలయం నిర్మించారు..
పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన ఆ బులెట్ బైక్ రోజు తిరిగి ఆ ఆలయం వెనుకకు రావడం జరుగుతూ ఉంది. ఒక రోజు పోలీసులు బైక్ను గొలుసులతో బంధించి లాక్కెళ్లారు. అలాగే వాళ్లు ఆ బైక్ నుంచి పెట్రోల్ను కూడా తీసేశారు. అయినప్పటికీ తర్వాత ఆ బైక్ రహస్యంగా ఓం బన్నా మరణించిన ప్రదేశానికి తిరిగి వచ్చింది. ఆ ప్రదేశంలో స్థానికులు ఓం బన్నాకు అంకితం చేసిన ఒక ఆలయాన్ని నిర్మించారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన బైక్ను అక్కడ శాశ్వతంగా ప్రతిష్టించారని వెల్లడించారు. ఓం బన్నా డిసెంబర్ 2, 1988న మరణించాడు. అయితే ఈ ఆలయం ఇక్కడి ప్రజల్లో అపారమైన విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. ఈ గుడికి రాజస్థాన్ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి పూజలు చేస్తారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి వచ్చే భక్తులందరూ కూడా ఆలయాన్ని సందర్శించే వారందరినీ ఓం బన్నా రక్షిస్తాడని నమ్ముతారు. ఇది బుల్లెట్ బాబా ఆలయం కథ.
READ ALSO: Putin – Netanyahu: గాజాలోకి రష్యా ఎంట్రీ.. నెతన్యాహుకు పుతిన్ ఫోన్!
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..