Bullet Baba Temple: ఈ గుడిలో ఆశ్చర్యకరమైన దేవుడు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Bullet Baba Temple: దేవుడు సర్వాంతర్యామి.. విశ్వాసం అనేది ఒక వ్యక్తిని దేవుడిని వెతకడానికి ప్రేరేపిస్తుంది. రాజస్థాన్లో ఉన్న ఒక ఆలయంలో కొలువుదీరిన దేవుడిని చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.. ఈ ఆలయంలో రాళ్లు లేదా విగ్రహాలను కాకుండా బుల్లెట్ బైక్లను పూజిస్తారు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆలయాన్ని ఓం బన్నా ఆలయం అంటారు. దీనిని “బుల్లెట్ బాబా ఆలయం” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Madanapalle Kidney Racket: మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు.. ఒక్కో కిడ్నీ పాతిక లక్షలకు
Also Read
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
- KTR: కాళేశ్వరంపై కాంగ్రెస్ అబద్ధాల కోటలు బద్దలయ్యాయి.. హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- LSG vs RR: టాస్ గెలిచిన లక్నో.. బ్యాటింగ్ ఎవరిదంటే?
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
పాలి-జోధ్పూర్ హైవే సమీపంలో ఆలయం..
ఈ ఆలయం పాలి-జోధ్పూర్ హైవే సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన ఎవరైనా రోడ్డు ప్రమాదాల నుంచి విముక్తి పొందుతారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడ బుల్లెట్ బైక్ను పూజించడమే కాకుండా, మద్యం, కొబ్బరికాయలు, పువ్వులను నైవేద్యంగా పెడతారు. ఆలయం కథలోకి వెళ్తే.. ఓం బన్నా ఆలయం వెనుక ఒక బుల్లెట్ బైక్ పార్క్ చేసి ఉంది. దాని నంబర్ RNJ 7773. ఇక్కడి ప్రజలు దానికి పూలు, కొబ్బరికాయలు, మద్యం, డబ్బులను కానుకలుగా సమర్పిస్తారు. ఈ బుల్లెట్ బైక్ను ఒకప్పుడు ఓం బన్నా అనే వ్యక్తి నడిపాడని, అతను రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెబుతారు. ఓం బన్నా కూడా ఇదే బైక్ను నడుపుతున్నాడని చెబుతారు. ప్రమాదం తర్వాత, పోలీసులు బుల్లెట్ బైక్ను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు, కానీ ఆ బైక్ ప్రతిరోజూ ఓం బన్నా మరణించిన అదే ప్రదేశానికి వెళుతూనే ఉంది.
అలా ఆలయం నిర్మించారు..
పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన ఆ బులెట్ బైక్ రోజు తిరిగి ఆ ఆలయం వెనుకకు రావడం జరుగుతూ ఉంది. ఒక రోజు పోలీసులు బైక్ను గొలుసులతో బంధించి లాక్కెళ్లారు. అలాగే వాళ్లు ఆ బైక్ నుంచి పెట్రోల్ను కూడా తీసేశారు. అయినప్పటికీ తర్వాత ఆ బైక్ రహస్యంగా ఓం బన్నా మరణించిన ప్రదేశానికి తిరిగి వచ్చింది. ఆ ప్రదేశంలో స్థానికులు ఓం బన్నాకు అంకితం చేసిన ఒక ఆలయాన్ని నిర్మించారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన బైక్ను అక్కడ శాశ్వతంగా ప్రతిష్టించారని వెల్లడించారు. ఓం బన్నా డిసెంబర్ 2, 1988న మరణించాడు. అయితే ఈ ఆలయం ఇక్కడి ప్రజల్లో అపారమైన విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. ఈ గుడికి రాజస్థాన్ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి పూజలు చేస్తారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి వచ్చే భక్తులందరూ కూడా ఆలయాన్ని సందర్శించే వారందరినీ ఓం బన్నా రక్షిస్తాడని నమ్ముతారు. ఇది బుల్లెట్ బాబా ఆలయం కథ.
READ ALSO: Putin – Netanyahu: గాజాలోకి రష్యా ఎంట్రీ.. నెతన్యాహుకు పుతిన్ ఫోన్!
తాజావార్తలు
-
RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
-
Ukraine: ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్!
-
Vaibhav Sooryavanshi: లక్నోపై చేసిన పరుగులు 8.. అయినా అరుదైన రికార్డు సాధించిన వైభవ్ సూర్యవంశీ..
-
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
-
LSG vs RR: పొదుపుగా బౌలింగ్ చేసిన లక్నో.. టార్గెట్ ఎతంటే?
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?