Bullet Baba Temple: ఈ గుడిలో ఆశ్చర్యకరమైన దేవుడు.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bullet Baba Temple: దేవుడు సర్వాంతర్యామి.. విశ్వాసం అనేది ఒక వ్యక్తిని దేవుడిని వెతకడానికి ప్రేరేపిస్తుంది. రాజస్థాన్లో ఉన్న ఒక ఆలయంలో కొలువుదీరిన దేవుడిని చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే.. ఈ ఆలయంలో రాళ్లు లేదా విగ్రహాలను కాకుండా బుల్లెట్ బైక్లను పూజిస్తారు. ఇది వినడానికి ఆశ్చర్యకరంగా ఉండవచ్చు. కానీ ఇది నిజం.. ఈ ఆలయాన్ని ఓం బన్నా ఆలయం అంటారు. దీనిని “బుల్లెట్ బాబా ఆలయం” అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం కథ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Madanapalle Kidney Racket: మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో సంచలన విషయాలు.. ఒక్కో కిడ్నీ పాతిక లక్షలకు
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
పాలి-జోధ్పూర్ హైవే సమీపంలో ఆలయం..
ఈ ఆలయం పాలి-జోధ్పూర్ హైవే సమీపంలో ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన ఎవరైనా రోడ్డు ప్రమాదాల నుంచి విముక్తి పొందుతారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఇక్కడ బుల్లెట్ బైక్ను పూజించడమే కాకుండా, మద్యం, కొబ్బరికాయలు, పువ్వులను నైవేద్యంగా పెడతారు. ఆలయం కథలోకి వెళ్తే.. ఓం బన్నా ఆలయం వెనుక ఒక బుల్లెట్ బైక్ పార్క్ చేసి ఉంది. దాని నంబర్ RNJ 7773. ఇక్కడి ప్రజలు దానికి పూలు, కొబ్బరికాయలు, మద్యం, డబ్బులను కానుకలుగా సమర్పిస్తారు. ఈ బుల్లెట్ బైక్ను ఒకప్పుడు ఓం బన్నా అనే వ్యక్తి నడిపాడని, అతను రోడ్డు ప్రమాదంలో మరణించాడని చెబుతారు. ఓం బన్నా కూడా ఇదే బైక్ను నడుపుతున్నాడని చెబుతారు. ప్రమాదం తర్వాత, పోలీసులు బుల్లెట్ బైక్ను పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు, కానీ ఆ బైక్ ప్రతిరోజూ ఓం బన్నా మరణించిన అదే ప్రదేశానికి వెళుతూనే ఉంది.
అలా ఆలయం నిర్మించారు..
పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన ఆ బులెట్ బైక్ రోజు తిరిగి ఆ ఆలయం వెనుకకు రావడం జరుగుతూ ఉంది. ఒక రోజు పోలీసులు బైక్ను గొలుసులతో బంధించి లాక్కెళ్లారు. అలాగే వాళ్లు ఆ బైక్ నుంచి పెట్రోల్ను కూడా తీసేశారు. అయినప్పటికీ తర్వాత ఆ బైక్ రహస్యంగా ఓం బన్నా మరణించిన ప్రదేశానికి తిరిగి వచ్చింది. ఆ ప్రదేశంలో స్థానికులు ఓం బన్నాకు అంకితం చేసిన ఒక ఆలయాన్ని నిర్మించారని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయన బైక్ను అక్కడ శాశ్వతంగా ప్రతిష్టించారని వెల్లడించారు. ఓం బన్నా డిసెంబర్ 2, 1988న మరణించాడు. అయితే ఈ ఆలయం ఇక్కడి ప్రజల్లో అపారమైన విశ్వాసాన్ని సొంతం చేసుకుంది. ఈ గుడికి రాజస్థాన్ నలుమూలల నుంచి ప్రజలు వచ్చి పూజలు చేస్తారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడి వచ్చే భక్తులందరూ కూడా ఆలయాన్ని సందర్శించే వారందరినీ ఓం బన్నా రక్షిస్తాడని నమ్ముతారు. ఇది బుల్లెట్ బాబా ఆలయం కథ.
READ ALSO: Putin – Netanyahu: గాజాలోకి రష్యా ఎంట్రీ.. నెతన్యాహుకు పుతిన్ ఫోన్!
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!