NTV Telugu Site icon

JPL 2024: ఆంధ్రజ్యోతిపై ఘన విజయం.. జేపీఎల్ 2024 ఫైనల్లో ఎన్టీవీ!

Jpl 2024 Ntv

Jpl 2024 Ntv

Ntv Reached JPL 2024 Finals: తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ టీవీ ఛానెల్ ‘ఎన్టీవీ’.. జ‌ర్న‌లిస్టు ప్రీమియ‌ర్ లీగ్ (జేపీఎల్‌) టీ20 టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్-1లో ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఏబీఎన్ నిర్ణీత 20 ఓవర్లలో 107 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఎన్టీవీ 20 ఓవర్లలో 155 రన్స్ చేసింది.