Site icon NTV Telugu

NIA Raids: మహారాష్ట్ర-కర్ణాటకలోని 44 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాదుల కుట్రపై నిఘా

Nia

Nia

దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు గ్లోబల్ టెర్రర్ గ్రూప్ ఐఎస్ఐఎస్ కుట్ర చేసిందనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ కర్ణాటక, మహారాష్ట్రలోని దాదాపు 44 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. కర్ణాటకలోని కొన్ని చోట్ల ఈ దాడులు జరుగుతుండగా.. మహారాష్ట్రలోని పూణె, థానే రూరల్, థానే సిటీతో పాటు మీరా భయాందర్‌లలో కూడా ఎన్ఐఏ తనిఖీలు జరుగుతున్నాయి. కాగా, ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ ఆధారిత ఐఎస్ఐఎస్ కార్యకర్తల ప్రమేయంతో పెద్ద కుట్రను బయట పెట్టినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వర్గాలు తెలిపాయి. భారత్‌లో ఐసిస్ తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న నిందితుల కోసం విచారణ చేస్తున్న ఎన్ఐఏ అధికారులు తెలిపారు. అయితే, ఈ దాడులు చేస్తున్న మొత్తం లొకేషన్‌లలో కర్ణాటకలో ఒక చోట, పూణేలో 2, థానే రూరల్‌లో 31, థానే నగరంలో 9, భయందర్‌లో ఒక చోట అధికారులు సోదాలు చేశారు. థానేలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Exit mobile version