ఇండియాలో ఇవాళ కరోనా కేసులు కాస్త తగ్గిపోయాయి. 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 11,466 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో 3,37,87, 047 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,39, 683 కేసులు యాక్టీవ్గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 460 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో 4, 61, 849 మంది మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. 24 గంటల్లో ఇండియాలో 11, 961 మంది కరోనా నుంచి కోలుకోగా 52,69,139 మంది టీకాలు తీసుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 109. 63 కోట్ల మందికి టీకాలు తీసుకున్నారు.
ఇండియాలో కొత్తగా 11,466 కరోనా కేసులు, 460 మరణాలు
