Tirupati – Vijayawada Flight: తిరుపతి–విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం అయ్యాయి.. టెంపుల్ సిటీ-బెజవాడ మధ్య ఇవాళ్టి నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.. ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై-91 విమానయాన సంస్థ నడుపుతోంది.. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ నూతన సర్వీసును ప్రారంభించారు.. తిరుపతిలో ఉదయం 8 గంటల 5 నిమిషాలకు బయలుదేరే విమానం.. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనుంది.. తిరిగి ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి.. 10 గంటల 50 నిమిషాలకు తిరుపతి చేరుకోనుంది.. వారంలో నాలుగు రోజుల పాటు ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉండనుంది.. తిరుపతి–విజయవాడ మధ్య ప్రయాణికులకు ఈ కొత్త సర్వీసుతో మరింత సౌకర్యం కలగనుంది.. బెజవాడ, ఆ పరిసర ప్రాంతాల భక్తులు తిరుమల దర్శనానికి వెళ్లాలన్నా.. తిరిగి రావాలన్నా.. ఈ కొత్త సర్వీసులు కొంత ఉపయోగంగా ఉండనుంది..

