టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ల బంధం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎన్నో చర్చలు, వివాదాలు జరిగాయో మనం చూశాం. బయట ఎన్ని విమర్శలు వచ్చినా ఈ జంట మాత్రం కలిసే ఉంటూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, వీరి బంధంపై నరేష్ కుమారుడు నవీన్ విజయ్ కృష్ణ మొదటిసారి నోరు విప్పారు. పవిత్ర లోకేష్ తమ ఇంట్లోకి వచ్చాక తన తండ్రిలో వచ్చిన సానుకూల మార్పుల గురించి ఆయన షాకింగ్ విషయాలను వెల్లడించారు.
Also Read : Jai Hanuman : హనుమాన్ సీక్వెల్ లో ఆస్కార్ విన్నర్తో.. ప్రశాంత్ వర్మ భారీ స్కెచ్!
తాజాగా ఒక ఇంటర్వ్యూలో నవీన్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ, పవిత్ర లోకేష్ రాకతో తమ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగిందని చెప్పారు.. ‘నాన్న చాలా కామ్ అయ్యారు. నిజం చెప్పాలంటే 56 ఏళ్ల వయసులో కూడా నాన్న ఇంత ప్రశాంతంగా కనిపిస్తున్నారంటే దానికి కారణం పవిత్ర గారే. ఆమె ఉన్నప్పుడు నాన్న చాలా కామ్గా ఉంటారు. అది నాకు చాలా పాజిటివ్ సిగ్నల్లా అనిపిస్తుంది. జీవితంలో ప్రతి పని అందరినీ సంతృప్తి పరచలేదు. మా నాన్న ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, అదే మాకు కావాల్సింది. ఆయన మెంటల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్. వారిద్దరు సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయ నిర్మల గారు కూడా కలిశారు. వారికి ఈ బంధం పట్ల పూర్తి అంగీకారించారు’ అని నవీన్. నాన్న తీసుకున్న ఏ నిర్ణయాన్ని వారు కాదనలేదు, ఎప్పుడూ సపోర్ట్ చేసేవారు’ అంటూ తండ్రి వ్యక్తిత్వాన్ని నవీన్ కొనియాడారు. దీని బట్టి బయట ఎన్ని ట్రోల్స్ వచ్చినా, కుటుంబ సభ్యులు మాత్రం నరేష్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నారని నవీన్ మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
