టాలీవుడ్ యంగ్ హీరో ఆయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన చేసే ప్రతి సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా నాగ శౌర్య వంద శాతం ఆ సినిమా కోసం కష్టపడతారు.. అందుకే నాగ శౌర్య సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూ వుంటారు. తాజాగా నాగ శౌర్య నటించిన సినిమా రంగబలి.ఈ సినిమాలో యుక్తి తరేజ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను పవన్ బసంశెట్టి తెరకెక్కించారు.రంగబలి సినిమా జులై ఏడవ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో నాగశౌర్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.అంతేకాకుండా ఈ సినిమా ద్వారా తప్పకుండా విజయం అందుకుంటాం అంటూ ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. మన సొంత ఊరిని మన మూలాలను గుర్తుచేసే చిత్రమే రంగ బలి అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత ఈ సినిమాకు ఈ పేరు పెట్టడం వెనుక కారణం ఏంటి అనే విషయం అందరికీ బాగా అర్థం అవుతుంది అని ఆయన తెలిపారు.అదేవిధంగా తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను 18 మంది దర్శకులతో పని చేశానని ఆయన తెలిపారు.సినిమాలు సక్సెస్ అయినప్పుడు నా నిర్ణయం కరెక్ట్ అని ఫెయిల్యూర్ అయినప్పుడు నిర్ణయం కరెక్ట్ కాదని నేనెప్పుడూ భావించలేదని తెలిపారు.ఇండస్ట్రీలో కొనసాగడం అంటే సమయం ఎంతో ముఖ్యమైనదని ఆయన తెలిపారు. మన టైం వచ్చే వరకు వేచి చూడాల్సిందే అని అందుకే తాను ఇండస్ట్రీలోనే కొనసాగడానికే నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. హీరోగా తనకు అవకాశాలు రాకపోయినా చివరికి లైట్ బాయ్ గా అయినా పనిచేస్తూ ఇండస్ట్రీలోనే కొనసాగుతానని నాగశౌర్య తెలిపారు. నాకు సినిమా ఇండస్ట్రీ తప్ప ఇంకేమి తెలియదని అందుకే తాను ఎప్పటికి అయినా ఇండస్ట్రీలోనే కొనసాగుతాను అంటూ చెప్పుకొచ్చారు. నాగ శౌర్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.