టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన నటనతో, అందంతో మంత్రముగ్ధులను చేస్తున్న నటి మృణాల్ ఠాకూర్. బయటకు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించే ఈ ‘సీతమ్మ’.. కెరీర్ ప్రారంభంలో, వ్యక్తిగత జీవితంలో బాడీ షేమింగ్ వల్ల తీవ్రమైన మానసిక వేదనను అనుభవించానని వెల్లడించింది. శరీర బరువు కారణంగా నెటిజన్లే కాకుండా, తన చుట్టూ ఉన్నవారు కూడా తనను ఎగతాళి చేసేవారని, ఆ సమయంలో తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి మృణాల్ తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పింది.
Also Read : The Paradise: నాని కోసం రూల్స్ బ్రేక్ చేశాను.. శ్రీకాంత్ ఓదెల ఎమోషనల్ ట్వీట్!
మృణాల్ మాట్లాడుతూ.. ‘శరీర బరువు వల్ల వచ్చిన ట్రోల్స్ చూసి ఏడుస్తూ నిద్రపోయి.. ఉబ్బిన కళ్లతో నిద్రలేచిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆ మాటలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. కానీ, ఒకరోజు జిమ్లో ఒక సన్నటి అమ్మాయి నా దగ్గరకు వచ్చి ‘నేను మీలాగా మారాలంటే ఏం చేయాలి?’ అని అడగింది.. అప్పుడు నాకు అర్థమైంది.. మనం ఎలా ఉన్నా మనల్ని ఇష్టపడేవారు ఉంటారని. మనల్ని మనం గౌరవించుకోవడం మొదలుపెడితేనే ఇతరులు మనకు విలువ ఇస్తారని తెలుసుకున్నాను. వేల మంది ట్రోల్స్ చేసినా వాటిని పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ సాగిపోవాలని అక్షయ్ సర్ చెప్పారు. ఏదైనా సినిమా పాత్ర కోసం సన్నబడాల్సి వస్తే అది వృత్తిలో భాగం కాబట్టి కచ్చితంగా మారాలని ఆయన సూచించారు. అప్పటి నుంచి నేను ఆ మాటలనే ఫాలో అవుతున్నాను’ అని మృణాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాడీ షేమింగ్ ఎదుర్కొనే వారికి మృణాల్ మాటలు ఒక పెద్ద సపోర్ట్ లా కనిపిస్తున్నాయి.
