Rape Case: ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. కామాంధుడిపై పోలీసుల కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rape Case: మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలోని గౌహర్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 6 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం ఘటన మొత్తం రాష్ట్రాన్ని ఆగ్రహానికి గురిచేసింది. నవంబర్ 21వ తేదీ శుక్రవారం రాత్రి, ఓ కామాంధుడు బాలికపై అత్యాచారాని ఒడిగట్టాడు. దీంతో బాలిక పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన జరిగిన వెంటనే నిందితుడు పరారయ్యాడు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విస్తృతంగా నిరసనలు జరిగాయి. దీంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. సంఘటన జరిగిన ఏడవ రోజున నిందితుడు సల్మాన్ అలియాస్ నాజర్ను అరెస్టు చేశారు. భోపాల్లోని గాంధీనగర్లో అరెస్టు చేసిన.. రైసెన్కు తరలిస్తుండగా కిరాత్ నగర్ గ్రామం సమీపంలో నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు.
READ MORE: Anantapur Crime: అనంతపురంలో దారుణం.. డిప్యూటీ తాహసీల్దార్ భార్య, కుమారుడు మృతి!
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
అయితే.. నిందితుడు సల్మాన్పై పోలీసుల రూ.30 వేల బహుమతి ప్రకటించారు. దీంతో భోపాల్లోని గాంధీనగర్ వార్డ్ నంబర్ 11లో ఒక టీ స్టాల్ వద్ద సల్మాన్ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. టీ తాగడానికి స్టాల్కు వచ్చిన సల్మాన్ను పోలీసులు వెంటనే పట్టుకున్నారు. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత, గాంధీనగర్ పోలీసులు సల్మాన్ను గోహర్గంజ్ పోలీసులకు అప్పగించారు. గోహర్గంజ్ పోలీసులు నిందితుడిని తీసుకుని పోలీస్ స్టేషన్కు బయలుదేరారు. దీంతో వారి వాహనం పంక్చర్ అయింది. పోలీసులు దిగి సరి చేస్తుండగా.. నిందితుడు తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. కాలుకు బుల్లెట్ గాయం అయింది. అక్కడి నుంచి భోపాల్లోని జేపీ ఆసుపత్రికి తరలించారు. ఇంతలో, సల్మాన్ అరెస్టు గురించి తెలుసుకున్న జై మా భవానీ హిందూ సంస్థ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. అత్యాచారానికి గురైన బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఎయిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలికకు తక్షణ శస్త్రచికిత్స జరిగింది. ఆమె శరీరం తీవ్రంగా నలిగి పోయింది. అనేక సంక్లిష్ట చికిత్సలు జరిగాయి. బాలిక పూర్తిగా కోలుకోవడానికి చాలా నెలలు పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. దాదాపు మూడు నెలల్లో మరో శస్త్రచికిత్స అవసరం కావచ్చునని పేర్కొన్నారు. ప్రస్తుతం, బాలిక పరిస్థితి కొంతవరకు స్థిరపడుతుందని భావిస్తున్నారు.
READ MORE: Maharashtra: బీజేపీ-శివసేన మధ్య విభేదాలు! కూటమి నిలబడేనా?
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?