MP Navneet Kaur: ఎంపీ నవనీత్ కేసులో నేడు సుప్రీం తీర్పు..!

12

12

మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ రాణా క్యాస్ట్ సర్టిఫికెట్ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఆమె 2019లో ఎస్సీ కేటగిరిలో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే, ఆమె ఎస్సీ సర్టిఫికెట్‌ను చట్టవిరుద్ధంగా పొందారనే కారణంతో దాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది. దీంతో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ లోక్‌సభ ఎంపీ నవనీత్ కౌర్ రాణా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది.

Also Read: Ramayana – Ranbir Kapoor: వైరల్ గా మారిన రణబీర్ కపూర్ ‘రామాయణ’ సెట్స్ పిక్స్..!

జూన్ 8, 2021న, ‘మోచి’ కుల ధృవీకరణ పత్రాన్ని కల్పిత పత్రాలను ఉపయోగించి మోసపూరితంగా పొందారని హైకోర్టు పేర్కొంది. దీనితో అమరావతి ఎంపీకి రూ. 2 లక్షల జరిమానా కూడా విధించింది . ఆమె ‘సిక్కు-చామర్’ కులానికి చెందినదని రికార్డులు సూచిస్తున్నాయి. ఇకపోతే.,షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న స్వతంత్ర శాసనసభ్యుడి అభ్యర్థన పై న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, సంజయ్ కరోల్‌ లతో కూడిన ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది.

Also Read: Motorola Edge 50 Pro Price: భారత్‌లో ‘మోటో ఎడ్జ్‌ 50 ప్రో’ లాంచ్.. సూపర్ లుక్‌, అద్భుత ఫీచర్స్!

షెడ్యూల్డ్ కుల ధృవీకరణ పత్రాన్ని పొందడం కోసం నవనీత్ రానా ‘మోచి’ కులానికి చెందిన దానినని చేసిన వాదన మోసపూరితమైనదని, అటువంటి వర్గానికి చెందిన అభ్యర్థి కాదని తెలిసినప్పటికీ, అటువంటి అభ్యర్థికి లభించే అనేక ప్రయోజనాలను పొందాలనే ఉద్దేశ్యంతో నవనీత్ రాణా చేసిన వాదన మోసపూరితమైనదని హైకోర్టు పేర్కొంది. కాగా.. నవనీత్ రాణా ఇటీవలే బీజేపీలో చేరారు. ఈ ఎన్నికల్లో అమరావతి నుంచి పోటీలో ఉన్నారు. కాబట్టి నేడు వెలుబడే తీర్పులో ఎటువంటి ఆశక్తికరమైన విషయాలు వస్తాయో చూడాలి మరి.