NTV Telugu Site icon

MP Arvind: బీజేపీని వాడుకుని వెళ్లిపోతే.. వాళ్లను జుట్టు పట్టుకుని లాక్కొస్తాం..

Mp Arvind

Mp Arvind

ఈ మధ్య మీడియాలో చాలా కథనాలను చూస్తున్నామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. అందరూ బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని చెబుతున్నారు.. అందరినీ పంపించేస్తున్నారు.. మరి నన్నొక్కడిని విడిచిపెట్టారు ఆయన ప్రశ్నించారు. మీడియా న్యూస్ రిపోర్టింగ్ చేయాలి.. తప్ప న్యూస్ క్రియేట్ చేయొద్దు అని ఆయన తెలిపారు. టీడీపీతో పొత్తు.. ఇతర పార్టీలతో పొత్తు అనేది ఉండదు.. సునామిలా దూసుకెళ్తామని నిజామాబాద్ ఎంపీ అన్నారు. సైలెంట్ గా ఉన్నామంటే.. మాకేం తెలియక కాదు.. కేసీఆర్ తాతకు జవాబు ఇచ్చేది కూడా మాకు తెలుసు అని ధర్మపురి అర్వింద్ అన్నారు.

Read Also: Taneti Vanitha : పవన్ అవగాహనారాహిత్యంతోనే ఇలాంటి వ్యాఖ్యలు

త్రిపురలో ఒక్క శాతం ఓటు ఉంటే దాన్ని 51 శాతానికి తీసుకొచ్చామని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. మహారాష్ట్రలో మా పేరు, మోడీ బొమ్మ తోని శివసేన అధికారంలోకి వచ్చారు.. ఆ తర్వాత పారిపోయారు.. వాళ్లను కూడా జుట్టు పట్టుకుని లాక్కొచ్చామన్నాడు. శరద్ పవార్ ఎన్సీపీ పార్టీని బీజేపీ బ్రేక్ చేసిందంటున్నారు.. ఆ పార్టీ పుట్టిందే కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా.. నేడు ఆ పార్టీ కుటుంబ రాజకీయాల కారణంగా విచ్ఛిన్నమైంనది అని చెప్పాడు. శివసేన.. భావజాలానికి విరుద్ధంగా కుర్చీ కోసం పాకులాడితే ఆ పార్టీ విచ్ఛిన్నమైంది.. బీజేపీని వాడుకునే వెళ్లిపోతే.. వాళ్లను జుట్టు పట్టుకుని లాక్కురావడం మాకు తెలుసు అని ఎంపీ అర్వింద్ పేర్కొన్నాడు.

Read Also: Mirna Menon Pics: శారీలో సెగలు రేపుతున్న మిర్నా మీనన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్!

ఇది బీజేపీ టీమ్, మోడీ టీం.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం సునామీ చూడబోతోంది.. కేసీఆర్ ఒక బచ్చా.. కేసీఆర్ మర్యాద ఇస్తే.. మేమిస్తాం.. కేసీఆర్ ను ఓడించేందుకు గజ్వేల్ కు పోయి కొట్లాడుతా అని ఈటల అన్నాడు.. గజ్వేల్ కు కాదు.. కేసీఆర్ కు దమ్ముంటే.. హుజురాబాద్ కు రావాలి అని ఆయన డిమాండ్ చేశాడు. నువ్ కాకుంటే.. నీ బిడ్డను దింపు.. ఈసారి కిషన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు.