UP: కసాయి తల్లి.. ప్రియుడితో హనీమూన్కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది
- ప్రియుడితో హనీమూన్కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది ఓ కసాయి తల్లి
- అడ్డుగా ఉన్న పిల్లలను విషమిచ్చి హతమార్చింది తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మ దైవంతో సమానం. నవమోసాలు కని పెంచి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడిపోతుంది. అలాంటి కన్న తల్లులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కానీ, ప్రస్తుత రోజుల్లో కొంతమంది తల్లులను చూస్తుంటే.. కంటేనే అమ్మాని అంటే ఎలా.. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా అని అనాల్సిన పరిస్థితి దాపరించింది. అమ్మతనానికే మాయని మచ్చగా తయారవుతున్నారు కొందరు తల్లులు. పరాయి వ్యక్తుల మోజులో పడి కన్న బిడ్డలను సైతం చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రియుడితో హనీమూన్కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది ఓ కసాయి తల్లి.
Also Read:Gold Rates: ఊరించి.. ఉసూరుమనిపించిన గోల్డ్ ధరలు.. నేడు మళ్లీ పెరిగాయ్
Also Read
- Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే 'పెసర లడ్డూలు'.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్గా ఘనత..
- Pakistan: షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ముస్కాన్ (24) అనే మహిళకు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త వసీం జీవనోపాధి కోసం చండీగఢ్ లో నివసిస్తుండడంతో, జునైద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ముస్కాన్. జునైద్తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని, అడ్డుగా ఉన్న పిల్లలను విషమిచ్చి హతమార్చింది తల్లి. పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:Ananya Nagalla : తన బ్రేకప్ స్టోరీ పంచుకున్న అనన్య నాగళ్ల..
దర్యాప్తులో ఈ మరణాలలో తల్లి ప్రమేయం ఉందని తేలింది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, ఆమె నేరం అంగీకరించింది అని అధికారి తెలిపారు. తన ప్రేమికుడు జునైద్తో కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో తన పిల్లలు అడ్డంకిగా ఉన్నారని, అందుకే వారిని చంపాలని నిర్ణయించుకున్నానని ముస్కాన్ చెప్పిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు పిల్లలను చంపిన తర్వాత ఆ జంట “హనీమూన్” కి వెళ్లాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. కొంత కాలం క్రితం సంగారెడ్డిలోని అమీన్ పూర్ కు చెందిన ఓ మహిళ తన టెన్త్ క్లాస్ ప్రియుడితో కలిసి బ్రతికేందుకు కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను చింపేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
TVS NTORQ 125: కొత్త కలర్స్, స్పోర్టీ గ్రాఫిక్స్తో టీవీఎస్ NTORQ 125.. యువత కోసం స్టైలిష్ అప్డేట్, ధరలు ఇవే!
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
-
Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే బ్యాటర్గా ఘనత..
-
Moringa Health Benefits: మునగను ‘మిరాకిల్ ట్రీ’ అని ఎందుకు అంటారు? కారణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!