UP: కసాయి తల్లి.. ప్రియుడితో హనీమూన్కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది
- ప్రియుడితో హనీమూన్కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది ఓ కసాయి తల్లి
- అడ్డుగా ఉన్న పిల్లలను విషమిచ్చి హతమార్చింది తల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మ దైవంతో సమానం. నవమోసాలు కని పెంచి కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చినా విలవిల్లాడిపోతుంది. అలాంటి కన్న తల్లులకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కానీ, ప్రస్తుత రోజుల్లో కొంతమంది తల్లులను చూస్తుంటే.. కంటేనే అమ్మాని అంటే ఎలా.. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా అని అనాల్సిన పరిస్థితి దాపరించింది. అమ్మతనానికే మాయని మచ్చగా తయారవుతున్నారు కొందరు తల్లులు. పరాయి వ్యక్తుల మోజులో పడి కన్న బిడ్డలను సైతం చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రియుడితో హనీమూన్కు వెళ్లేందుకు ఇద్దరు పిల్లలను చంపేసింది ఓ కసాయి తల్లి.
Also Read:Gold Rates: ఊరించి.. ఉసూరుమనిపించిన గోల్డ్ ధరలు.. నేడు మళ్లీ పెరిగాయ్
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ ప్రాంతం రోడ్కాలి గ్రామానికి చెందిన ముస్కాన్ (24) అనే మహిళకు అర్హాన్ (5), ఇనాయ(1) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్త వసీం జీవనోపాధి కోసం చండీగఢ్ లో నివసిస్తుండడంతో, జునైద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ముస్కాన్. జునైద్తో కలిసి వెళ్లిపోవాలని నిర్ణయించుకొని, అడ్డుగా ఉన్న పిల్లలను విషమిచ్చి హతమార్చింది తల్లి. పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read:Ananya Nagalla : తన బ్రేకప్ స్టోరీ పంచుకున్న అనన్య నాగళ్ల..
దర్యాప్తులో ఈ మరణాలలో తల్లి ప్రమేయం ఉందని తేలింది. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో, ఆమె నేరం అంగీకరించింది అని అధికారి తెలిపారు. తన ప్రేమికుడు జునైద్తో కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో తన పిల్లలు అడ్డంకిగా ఉన్నారని, అందుకే వారిని చంపాలని నిర్ణయించుకున్నానని ముస్కాన్ చెప్పిందని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు పిల్లలను చంపిన తర్వాత ఆ జంట “హనీమూన్” కి వెళ్లాలని ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు. కొంత కాలం క్రితం సంగారెడ్డిలోని అమీన్ పూర్ కు చెందిన ఓ మహిళ తన టెన్త్ క్లాస్ ప్రియుడితో కలిసి బ్రతికేందుకు కడుపున పుట్టిన ముగ్గురు పిల్లలను చింపేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!