Moosarambagh Bridge: మూసీకి పెరిగిన వరద.. ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేత..

  • మూసీకి పెరిగిన వరద
  • ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేత
Moosarambagh Bridge

Moosarambagh Bridge

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో వాతావరణం మేఘావృతమై ఉంది. అక్కడక్కడ వాన పడుతోంది. కాగా భారీ వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండలా మారాయి. ఈ రెండు జలాశయాల నుంచి మూసీకి వరద ప్రవాహం పెరిగింది. మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ముసరాంబాగ్ బ్రిడ్జి మూసివేశారు అధికారులు. నిన్న మధ్యాహ్నం నుంచి బ్రిడ్జి మూసివేశారు. ట్రాఫిక్ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ని గోల్నాక వైపు మళ్లించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అధికారులు.