ASEAN Summit: మలేసియా రాజధాని కౌలాలంపూర్లో అక్టోబర్ 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆసియాన్ సదస్సు జరగనున్నది. ప్రతి ఏటా ఈ సదస్సుకు ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఈసారి హాజరవుతారు. కానీ ఈసారి ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదని.. కేవలం వర్చువల్ గా హాజరవుతానని ఎక్స్ లో తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడా భేటీ రద్దు అయినట్లు సమాచారం. ట్రంప్ కూడా ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటలకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జరిగే 22వ ఆసియాన్ – ఇండియా సమ్మిట్లో వర్చువల్గా పాల్గొంటారు. ప్రధానమంత్రి మోదీ , ఆసియాన్ నాయకులు సంయుక్తంగా ఆసియాన్-భారత్ సంబంధాలలో పురోగతిని సమీక్షిస్తారని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి చొరవలను చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆసియాన్తో సంబంధాన్ని బలోపేతం చేసుకోవడం భారతదేశం యొక్క యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండో-పసిఫిక్ దార్శనికతకు కీలక స్తంభమని పేర్కొంది. ఈ నిర్ణయంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీకి సాధ్యమయ్యే ద్వైపాక్షిక భేటీపై గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మొదట్లో ప్రధాని మోదీ కౌలాలంపూర్తో పాటు కంబోడియాలో కూడా పర్యటించాలనుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ సదస్సుకు వెళ్లకపోవడత.. కంబోడియా పర్యటన కూడా వాయిదా పడింది.
ఈ సమ్మిట్ లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ భారత దేశానికి ప్రాతినిద్యం వహించనున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీయే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఫోన్లో ఆత్మీయ సంభాషణ జరిపిన అనంతరం.. మోదీ మలేసియాకు ఆసియాన్ ఛైర్మన్షిప్ లభించినందుకు అభినందించారు. “ఆసియాన్-ఇండియా సదస్సుకు వర్చువల్గా హాజరు అయ్యేందుకు ఎదురు చూస్తున్నాను. ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని ఆశిస్తున్నాను” అని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.
Had a warm conversation with my dear friend, Prime Minister Anwar Ibrahim of Malaysia. Congratulated him on Malaysia’s ASEAN Chairmanship and conveyed best wishes for the success of upcoming Summits. Look forward to joining the ASEAN-India Summit virtually, and to further…
— Narendra Modi (@narendramodi) October 23, 2025
