Mitchell Marsh FIR: ఢిల్లీలో మిచెల్ మార్ష్పై ఎఫ్ఐఆర్ నమోదు.. టీమిండియాపై ఆడుకుండా జీవితకాల నిషేధం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fir On Mitchell Marsh in Aligarh: ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే. ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్లో మార్ష్పై కేసు నమోదు అయింది. యూపీలోని అలీఘర్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్.. మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో పోలీసులు మార్ష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు కారణం వరల్డ్కప్ ట్రోఫీపై మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టడమే.
ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో భారత్పై గెలిచిన ఆస్ట్రేలియా ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆరోసారి ప్రపంచకప్ గెలుచుకున్న ఆసీస్ ప్లేయర్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే డ్రెస్సింగ్ రూమ్లో మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై తన పాదాలను ఉంచిన ఫోటో వైరల్గా మారింది. ఒక చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని.. రెండు పాదాలను ప్రపంచకప్ ట్రోఫీపై ఉంచిన ఫొటో తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా భారత ఫ్యాన్స్ మార్ష్ తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే అలీఘర్కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్టీఐ కార్యకర్త.. మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
- Amol Muzumdar: భారత్కు ఆసియా కప్.. ట్రోఫీ మాత్రం వద్దంటూ బీసీసీఐ నిర్ణయం.. కోచ్ అమోల్ కీలక వ్యాఖ్యలు..
- Ganesh Chaturthi 2026: ఇంట్లో గణపతిని ప్రతిష్ఠిస్తున్నారా..? దిశ, విగ్రహం, పూజ విషయంలో ఈ నియమాలు తప్పక పాటించండి..
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
Also Read: Suryakumar Yadav: ఇది బిగ్ మూమెంట్.. చాలా సంతోషంగా ఉంది: సూర్యకుమార్
ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్లో మిచెల్ మార్ష్పై పండిట్ కేశవ్ లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. మార్ష్ భారతీయ భావోద్వేగాలను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రపంచకప్పై పాదాలు వేసి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని అవమానించడమే కాకుండా.. 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని కూడా కించపరిచారని కేశవ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. మార్ష్ భారత్లో ఆడకుండా, అలాగే టీమిండియాపై ఎక్కడా ఆడుకుండా జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. కంప్లైంట్ కాపీని ప్రధాని మోడీ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కార్యాలయాలకు పంపించారు. కేశవ్ లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు మార్ష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: మీరే మాకు అతిపెద్ద బలం, మీ కోసం ఏదైనా చేస్తాం.. హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Ramayana: గణేష్ చతుర్థి రోజున ‘రామాయణం’ నుంచి దివ్యమైన సర్ప్రైజ్!
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?