2 Rupees : రెండు రూపాయలు చెల్లించని పోలీసులు.. కోర్టును ఆశ్రయించిన బీఎస్ఎన్ఎల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Rupees : ఉత్తరప్రదేశ్ పోలీసుల కారణంగా బీఎస్ఎన్ఎల్ కంపెనీ కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. దీనికి కారణం కూడా చాలా విచిత్రంగానూ, ఆశ్చర్యంగా అనిపిస్తుంది. రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్లలో సదరు బీఎస్ఎన్ఎల్ కంపెనీకి చెల్లించాల్సిన బిల్లులు చాలా ఏళ్లుగా పెండింగులో ఉన్నాయి. బిల్లు కూడా చాలా పెద్ద మొత్తమేమీ కూడా కాదు. దాన్ని కూడా వాళ్లు డిపాజిట్ చేయలేకపోయారు. జిల్లాలోని పది పోలీస్ స్టేషన్లలో కలిపి కంపెనీకి చెల్లించాల్సిన బిల్లు కేవలం రూ.248మాత్రమే. ఈ బిల్లును కూడా పోలీసులు బిల్లు డిపాజిట్ చేయకపోవడంతో బీఎస్ఎన్ఎల్ జాతీయ లోక్ అదాలత్ ను ఆశ్రయించింది.
Also Read
- Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
- Manav Suthar: టీమిండిలో మరో యువ కెరటం.. భారత టెస్టు జట్టులోకి దూసుకొచ్చిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా?
- CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
ప్రస్తుతం మొబైల్ కంపెనీలు రీఛార్జ్ లు ఎంత ఖరీదుగా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ప్రభుత్వ కంపెనీ బీఎస్ఎన్ఎల్ మాత్రం చౌక ధరకే రీఛార్జ్ లను అందిస్తోంది. దీంతో కస్టమర్లు ఈ కంపెనీకి ఆకర్షితులు అవుతున్నారు. కంపెనీ చౌక ప్లాన్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. అలాంటి సేవలందించే బీఎస్ఎన్ఎల్ కు మీర్జాపూర్ పోలీసులు రూ.248 బిల్లు చెల్లించలేకపోయారు. ఈ బకాయిలు ఒక్క పోలీస్ స్టేషన్లో కాకుండా జిల్లాలోని 10 పోలీస్ స్టేషన్లలో ఉండిపోవడం ఆశ్చర్యకరం.
మిర్జాపూర్ జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో కనీస బకాయి బిల్లు రూ.2 కాగా, గరిష్టంగా రూ.120. ఈ బిల్లులు డిపాజిట్ చేయాలని కంపెనీ పలుమార్లు పోలీసులకు నోటీసులు అందించినా పట్టించుకోలేదు. జిల్లాలోని లాల్గంజ్ పోలీస్ స్టేషన్లో అత్యల్పంగా బకాయి బిల్లు రూ.2 ఉండగా, కత్రా కొత్వాలిలో అత్యధికంగా రూ.120బకాయి బిల్లులు ఉన్నాయి. ఏళ్ల తరబడి చెల్లించకుండా ఉండిపోయిన బిల్లుల కోసం బీఎస్ఎన్ఎల్ జాతీయ లోక్ అదాలత్ను ఆశ్రయించింది. 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఎస్ఎన్ఎల్కు పోలీసు శాఖ మొత్తం రూ.248 బకాయిపడిందని మిర్జాపూర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బీఎస్ఎన్ఎల్ పీసీ రావత్ లేఖ కూడా రాశారు. ఎన్నో ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో నోటీసులిచ్చి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీకి సమాచార లేఖ పంపారు.
తాజావార్తలు
-
Varansi: అదంతా ఫేకు.. వారణాసి బడ్జెట్’పై స్టార్ యాక్టర్ సంచలనం!
-
Kalki 2: వచ్చే నెల నుంచే ‘కల్కి 2’ నాన్-స్టాప్ షూటింగ్!
-
SlumDog – 33 Temple Road: ‘స్లమ్డాగ్ – 33 టెంపుల్ రోడ్’ కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి… టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Nag Ashwin: కమల్ హాసన్ మిస్ చేసుకున్న కథతో.. నాన్-స్టాప్ మ్యూజికల్ వింతగా ‘సింగ్ గీతం’
-
Mobile Battery: రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెడితే నిజంగానే బ్యాటరీ పాడవుతుందా? అసలు నిజం ఏమిటి?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!