Site icon NTV Telugu

POCSO : నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి 25 ఏళ్ల శిక్ష

Pocso

Pocso

POCSO : నాంపల్లి లోని పోక్సో (POCSO) కోర్టు శుక్రవారం సంచలన తీర్పుని వెలువరించింది. 2023లో రాజ్‌భవన్‌ మక్త ప్రాంతంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాస్‌కు కోర్టు 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ కేసు తీర్పు ప్రకటనతో బాధిత కుటుంబానికి న్యాయం లభించిందన్న భావన నెలకొంది.

వివరాల ప్రకారం, 2023లో శ్రీనివాస్ అనే వ్యక్తి మైనర్ బాలికను సెల్‌ఫోన్ ఇస్తానని మాయ మాటలతో మభ్యపెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. బాలిక ప్రాణాలతో బయటపడిన తర్వాత, తల్లిదండ్రులు వెంటనే నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు (Section of IPC and POCSO Act) కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

కేసు విచారణ సమయంలో కోర్టుకు అందిన ఆధారాలు, బాలిక ధైర్యంగా ఇచ్చిన వాంగ్మూలం, వైద్య నివేదికలు అన్ని నిందితుడిపై అభియోగాలను నిరూపించాయి. పోక్సో చట్టం కింద ఈ కేసును విచారించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు, నేరం నిరూపితమైందని తేల్చి, శ్రీనివాస్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా, నిందితుడిపై జరిమానా కూడా విధించింది.

ఈ తీర్పుతో మైనర్ బాలికలపై హింసను తట్టుకోలేని స్థితిలో ఉన్న కుటుంబాలకు ఒక ధైర్యం లభించినట్లయిందని అనేకమంది న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. ‘‘ఈ తీర్పు బలహీన వర్గాల మహిళలకు రక్షణ కల్పించడంలో పెద్ద మైలురాయి అవుతుంది’’ అని ప్రజలు అభిప్రాయపడ్డారు.

Stock Market: అమెరికా ప్రకటనతో భారీ లాభాలలో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్స్

Exit mobile version