Duddilla Sridhar Babu : మొదటిసారి జపాన్‌ ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో ఇండియన్ పెవిలియన్

  • మంత్రి శ్రీధర్ బాబు జపాన్ పర్యటనకు సిద్ధం
  • ఒసాకా ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో తెలంగాణ స్టాల్‌కు ప్రత్యేక ఆకర్షణ
  • ఆ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి నేను దానిపై మాట్లాడలేను : శ్రీధర్ బాబు
Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu : తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఈ నెల 16 నుంచి 21వ తేదీ వరకు జపాన్ పర్యటనలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, అధికారుల బృందం ఈ పర్యటనలో భాగంగా జపాన్‌కు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలవబోయే కార్యక్రమం జపాన్‌లో తొలిసారిగా నిర్వహించబోయే ఒసాకా ఇండస్ట్రియల్ ఎక్స్ పో. ఈ ఎక్స్ పోలో భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఇండియన్ పెవిలియన్‌లో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు తమ తమ ప్రదర్శనలను ఏర్పాటు చేయనున్నాయి.

ఈ పెవిలియన్‌ను అన్ని రాష్ట్రాలు సంయుక్తంగా వినియోగించుకుంటూ, ప్రతి రాష్ట్రానికి రోజు వారీగా టైమ్ స్లాట్ కేటాయించనున్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా రెండు రోజుల పాటు అవకాశం లభించింది. ఈ సందర్భంగా తెలంగాణలోని పెట్టుబడి అవకాశాల గురించి అక్కడి పారిశ్రామికవేత్తలకు తెలియజేయనున్నారు. ఈ ఎక్స్ పోకి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. కేంద్రం కేటాయించిన పెవిలియన్‌లో తెలంగాణ ప్రభుత్వ స్టాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది రాష్ట్రానికి పెట్టుబడుల రాబాటలో కీలకంగా మారే అవకాశం ఉంది.

×
×
Ad

ఇక మరోవైపు, ఇటీవల వైరల్ అయిన హెచ్సీయూ భూముల అంశం గురించి మీడియా ప్రశ్నించగా, మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ … “ఆ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి నేను దానిపై మాట్లాడలేను,” అని పేర్కొన్నారు.

Khadar Bhasha: టీడీపీ, జనసేన పార్టీలు రెండు నాల్కల ధోరణి విడనాడాలి..