NTV Telugu Site icon

Minister Narayana : మరోసారి పల్నాడు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటన

Minister Narayana

Minister Narayana

పల్నాడు జిల్లాలో మరొకసారి మంత్రి నారాయణ పర్యటించుకున్నారు ….పిడుగురాళ్ల ప్రాంతంలో డయేరియా ప్రభలి ప్రజానీకం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, రెండు రోజుల క్రితం పలనాడు ప్రాంతంలో మంత్రి నారాయణ పర్యటించారు ….అక్కడ తీసుకుంటున్న చర్యలతో పాటు, తీసుకోవలసిన చర్యలపై కూడా అధికారులకు నిజానిర్దేశం చేశారు… అయినప్పటికీ డయేరియా అదుపులోకి రాకపోవడంతో, నేడు మరొకసారి స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో కలిసి డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించనున్నారు మంత్రి… నిన్న ఒక్కరోజే 21 కేసులు నమోదవడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది…. గడిచిన 15 రోజులుగా 200 పైగా డయేరియా కేసులు నమోదవడం, కొంతమంది మృత్యువాత పట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో డయేరియా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతోంది…. స్పెషలిస్ట్ సీనియర్ డాక్టర్లను పిడుగురాళ్ల పంపించే యోచన లో ఉంది ప్రభుత్వం.. అని ఆయన అన్నారు.