Site icon NTV Telugu

Damodara Raja Narasimha: 34 జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించిన మంత్రి దామోదర

Damodara

Damodara

సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. తెలంగాణలోని 34 జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లను వర్చువల్ గా ప్రారంభించారు.
వైద్యారోగ్య శాఖ- EFLU మధ్య కీలక ఒప్పందం కుదిరింది. విదేశాల్లో ఉద్యోగం కోసం జర్మన్, జపాన్ లాంగ్వేజ్ లలో నర్సింగ్ విద్యార్థులకు రెండేళ్ల శిక్షణ ఇవ్వనున్న ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజిస్ యూనివర్సిటీ.. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి క్యాన్సర్ పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు.. పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.. 34 జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభిస్తున్నాం..

Also Read:Ambati Rambabu : కూటమి ప్రభుత్వం యూరియా సరఫరాలో విఫలం

ప్రతి జిల్లాలో 20 బెడ్లతో ఈ సెంటర్ లు నడుస్తున్నాయి.. క్యాన్సర్ చాలా ప్రమాదకర వ్యాధి.. క్యాన్సర్ పై పోరాడిన నూరి దత్తాత్రేయని సలహాదారుగా నియమించాము.. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు ఏర్పాటు చేయబోతున్నాం.. ప్రతి గ్రామంలో ఈ వాహనాలు వెళ్లి క్యాన్సర్ పరీక్షలు చేసి నిర్దారణ చేస్తాం.. ప్రస్తుతం 55 వేల క్యాన్సర్ కేసులు రాష్ట్రంలో ఉన్నాయి.. వచ్చే ఈ ఏడాది ఈ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉంది.. EFLUతో విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకునే నర్సింగ్ విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.. విదేశాల్లో తెలంగాణ నర్సింగ్ విద్యార్థులు రాణించాలి అని ఆకాంక్షించారు.

Exit mobile version