Arvind Kejriwal: చదువంటే ఇష్టం లేని.. దేశ వ్యతిరేక శక్తులు సిసోడియాను జైలుకు పంపాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: దళితులు, అణగారిన పిల్లలకు నాణ్యమైన విద్య అక్కర్లేదని దేశంలోని కొందరు ‘దేశ వ్యతిరేకులు’ మనీష్ సిసోడియాను జైలుకు పంపారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. అంబేడ్కర్ ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని కలలు కన్నారని, అయితే ఈ వ్యక్తులు గత 75 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేశారని, దేశంలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని అన్నారు.
ఈ తప్పును సరిదిద్దడానికి దేవుడు మనీష్ సిసోడియా అనే వ్యక్తిని పంపాడని, ఆయన ఉదయం 6 గంటలకుతన పనిని ప్రారంభించి ఢిల్లీ పాఠశాలల చుట్టూ తిరిగేవాడన్నారు. గత ఐదేళ్లలో సిసోడియా విద్యలో చాలా మార్పులు చేశారని అన్నారు. కానీ కొన్ని దేశ వ్యతిరేక శక్తులు దేశం పురోగతిని కోరుకోవడం లేదని, దళిత విద్యార్థులు బాగా చదువుకోవడం ఇష్టం లేని వారంతా కలిసి సిసోడియాను జైలుకు పంపారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు దేశానికి శత్రువులని ఆయన అభిప్రాయపడ్డారు. కొంతమందికి జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన కూడా నిలిచిపోయిందని, అయితే తాను ఒక నెలలో పథకాన్ని తిరిగి ప్రారంభిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. ఈ పథకం కింద నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తామన్నారు. భారతదేశం ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందని, అయితే అంబేద్కర్ అందరికంటే ధీటైన వ్యక్తి అని ఢిల్లీ సీఎం అన్నారు. గతంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన విప్లవం తీసుకొచ్చిన వారిని నిరంకుశంగా జైళ్లలో బంధించారని అన్నారు.
Also Read
- Fuel Price Hike: సామాన్యులకు బిగ్ షాక్.. పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
Read Also: Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు ఉంచాలని తాము నిర్ణయించామని కేజ్రీవాల్ చెప్పారు. అయితే తాను గాంధీజీని మరిచిపోయానని చాలా మంది అంటున్నారు.. కానీ తాను గాంధీజీని చాలా గౌరవిస్తానని, ఆయన దేశం కోసం పోరాడారని, త్యాగాలు చేశారన్నారు, ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు, కానీ తాను అంబేద్కర్ను ఎక్కువగా గౌరవిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. “అంబేద్కర్ చాలా పేద కుటుంబంలో జన్మించాడు, అతను పాఠశాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కానీ అంబేడ్కర్ చదువు ఆపలేదు. ఆయన 1913లో యూఎస్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివారు. ఈ రోజు మీకు ఇంటర్నెట్ ఉంది. మీరు శోధించవచ్చు. గూగుల్లో. కొలంబియా యూనివర్సిటీ గురించి మీకు తెలుసు. ఆ కాలంలో యూనివర్సిటీ గురించి అతనికి ఎలా తెలిసింది? ఇది నన్ను కలవరపెడుతోంది. ఇది మాయాజాలం తప్ప మరొకటి కాదు,” అని కేజ్రీవాల్ చెప్పారు.
తాజావార్తలు
-
Fuel Price Hike: సామాన్యులకు బిగ్ షాక్.. పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!