Arvind Kejriwal: చదువంటే ఇష్టం లేని.. దేశ వ్యతిరేక శక్తులు సిసోడియాను జైలుకు పంపాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: దళితులు, అణగారిన పిల్లలకు నాణ్యమైన విద్య అక్కర్లేదని దేశంలోని కొందరు ‘దేశ వ్యతిరేకులు’ మనీష్ సిసోడియాను జైలుకు పంపారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. అంబేడ్కర్ ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని కలలు కన్నారని, అయితే ఈ వ్యక్తులు గత 75 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేశారని, దేశంలో ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని అన్నారు.
ఈ తప్పును సరిదిద్దడానికి దేవుడు మనీష్ సిసోడియా అనే వ్యక్తిని పంపాడని, ఆయన ఉదయం 6 గంటలకుతన పనిని ప్రారంభించి ఢిల్లీ పాఠశాలల చుట్టూ తిరిగేవాడన్నారు. గత ఐదేళ్లలో సిసోడియా విద్యలో చాలా మార్పులు చేశారని అన్నారు. కానీ కొన్ని దేశ వ్యతిరేక శక్తులు దేశం పురోగతిని కోరుకోవడం లేదని, దళిత విద్యార్థులు బాగా చదువుకోవడం ఇష్టం లేని వారంతా కలిసి సిసోడియాను జైలుకు పంపారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు దేశానికి శత్రువులని ఆయన అభిప్రాయపడ్డారు. కొంతమందికి జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన కూడా నిలిచిపోయిందని, అయితే తాను ఒక నెలలో పథకాన్ని తిరిగి ప్రారంభిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. ఈ పథకం కింద నిరుపేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇస్తామన్నారు. భారతదేశం ఎందరో మహానుభావులకు జన్మనిచ్చిందని, అయితే అంబేద్కర్ అందరికంటే ధీటైన వ్యక్తి అని ఢిల్లీ సీఎం అన్నారు. గతంలో విద్యారంగంలో విప్లవాత్మకమైన విప్లవం తీసుకొచ్చిన వారిని నిరంకుశంగా జైళ్లలో బంధించారని అన్నారు.
Also Read
- భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
- Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
- YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
Read Also: Rahul Gandhi: ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన రాహుల్ గాంధీ
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేద్కర్, భగత్ సింగ్ ఫోటోలు ఉంచాలని తాము నిర్ణయించామని కేజ్రీవాల్ చెప్పారు. అయితే తాను గాంధీజీని మరిచిపోయానని చాలా మంది అంటున్నారు.. కానీ తాను గాంధీజీని చాలా గౌరవిస్తానని, ఆయన దేశం కోసం పోరాడారని, త్యాగాలు చేశారన్నారు, ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు, కానీ తాను అంబేద్కర్ను ఎక్కువగా గౌరవిస్తానని కేజ్రీవాల్ చెప్పారు. “అంబేద్కర్ చాలా పేద కుటుంబంలో జన్మించాడు, అతను పాఠశాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, కానీ అంబేడ్కర్ చదువు ఆపలేదు. ఆయన 1913లో యూఎస్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చదివారు. ఈ రోజు మీకు ఇంటర్నెట్ ఉంది. మీరు శోధించవచ్చు. గూగుల్లో. కొలంబియా యూనివర్సిటీ గురించి మీకు తెలుసు. ఆ కాలంలో యూనివర్సిటీ గురించి అతనికి ఎలా తెలిసింది? ఇది నన్ను కలవరపెడుతోంది. ఇది మాయాజాలం తప్ప మరొకటి కాదు,” అని కేజ్రీవాల్ చెప్పారు.
తాజావార్తలు
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
-
TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్పై స్పీకర్ కీలక చర్య
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!