Manish Sisodia : ఈడీ లక్ష్యం మద్యం పాలసీనా లేదా ఎంసీడీ ఎన్నికలా..?

Manish Sisodia

Manish Sisodia

ఎక్సైజ్ పాలసీ విచారణకు సంబంధించి ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సోమవారం ప్రకటించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికలకు ఆప్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న పాఠక్‌కు సమన్లు రావడంపై ఆందోళన వ్యక్తం చేసిన సిసోడియా, ఏజెన్సీ ఎంసీడీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుంటుందా అని ఆశ్చర్యపోయారు. “ఈరోజు ఆమ్‌ ఎంసీడీ పోల్ ఇన్‌ఛార్జ్ దుర్గేష్ పాఠక్‌ను ఈడీ పిలిపించింది. ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీకి మా ఎంసీడీ పోల్ ఇన్‌చార్జికి సంబంధం ఏమిటి? వారి లక్ష్యం మద్యం పాలసీనా లేదా ఎంసీడీ ఎన్నికలా..?” అని సిసోడియా హిందీలో ట్వీట్‌ చేశారు. సమన్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుండి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు.

 

అయితే.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత వారం ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించి సిసోడియాను తన ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేర్కొన్న సీబీఐ నుంచి కేసును స్వాధీనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. 2021-22 సంవత్సరానికి మద్యం లైసెన్సుల కోసం టెండర్ ప్రక్రియకు అనుచిత ప్రయోజనాలను అందించిన విధానపరమైన లోపాలకు సంబంధించి సిసోడియా స్కానర్‌లో ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 అమలులో GNCTD చట్టం 1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్ (ToBR) 1993, ఢిల్లీ ఎక్సైజ్ చట్టం 2009 మరియు ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్ 2010 ప్రాథమిక ఉల్లంఘనలను ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నివేదిక గుర్తించింది. ఢిల్లీ ఎల్-జీ వీకే సక్సేనా ఆరోపించిన అవకతవకలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేసిన తర్వాత కేజ్రీవాల్ ప్రభుత్వం జూలైలో ఈ విధానాన్ని ఉపసంహరించుకుంది. అయితే ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని పేర్కొంది.