Malaysia Islamic Welfare Home: పిల్లలపై లైంగిక దోపిడీ.. ఇస్లామిక్ వెల్ఫేర్ హోమ్పై దాడి.. 171 మంది అరెస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Malaysia Islamic Welfare Home: మలేషియాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ పెద్ద ఇస్లామిక్ వ్యాపార సమూహంతో సంబంధం ఉన్న 20 సంక్షేమ సంస్థలపై పోలీసులు దాడి చేశారు. ఈ సంక్షేమ వసతి గృహాల్లో చిన్న పిల్లలను లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ మొత్తం కేసులో 105 మంది మహిళలతో సహా 171 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఉపాధ్యాయులు, సంరక్షకులు కూడా ఉన్నారు. 1 నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల 402 మంది పిల్లలను రక్షించారు. పోలీసులు చర్య తీసుకున్న 20 ప్రాంతాల్లో, 18 సంక్షేమ గృహాలు సెంట్రల్ సెలంగర్ రాష్ట్రంలో, రెండు దక్షిణ నెగెరీ సెంబిలాన్ రాష్ట్రంలో ఉన్నాయి.
పోలీసు అధికారి ప్రకారం, సంక్షేమ గృహాలలో పిల్లలపై లైంగిక దోపిడీ, వారిపై అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదు అందిందని, ఆ తర్వాత ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఈ సంక్షేమ గృహాలు మలేషియాకు చెందిన ఇఖ్వాన్ బిజినెస్ గ్రూప్కు చెందినవి. కేర్టేకర్లు ఈ చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా తమలో తాము తప్పుడు పనులు చేసుకునేలా ఒత్తిడి తెచ్చారని ఐజీ రజావుద్దీన్ హుస్సేన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఒక బిడ్డ అనారోగ్యం పాలైతే, పరిస్థితి విషమించే వరకు చికిత్స అందించలేదని వారు చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తప్పులు చేసినందుకు చిన్న పిల్లలను హాట్స్పూన్లతో కాల్చివేస్తున్నారని, మెడికల్ చెకింగ్ పేరుతో కేర్టేకర్లు పిల్లల శరీరాలను తాకేవారని తెలిపారు.
Also Read
Read Also:Amazon Great Indian Festival: బిగ్ సేల్కు సిద్ధమైన అమెజాన్.. మొబైల్స్పై 40 శాతం తగ్గింపు!
గ్లోబల్ ఇఖ్వాన్ గ్రూప్ మతపరమైన భావాలను ఉపయోగించి పిల్లలను లైంగికంగా దోపిడీ చేసి విరాళాలు సేకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వెల్ఫేర్ హోమ్లో నివసిస్తున్న పిల్లలందరూ గ్లోబల్ ఇఖ్వాన్ గ్రూప్ ఉద్యోగుల పిల్లలని దర్యాప్తులో వెల్లడైంది. వారి తల్లిదండ్రులు పుట్టినప్పటి నుండి సంక్షేమ గృహాలలో వదిలిపెట్టారు. కేసు దర్యాప్తు సందర్భంగా చిన్నారులందరికీ వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తామని ఐజీ హుస్సేన్ తెలిపారు. గ్లోబల్ ఇఖ్వాన్ గ్రూప్ వెబ్సైట్ ప్రకారం.. దీనిని మత నాయకుడు అషరీ మొహమ్మద్ స్థాపించారు. అతను మలేషియాలో అల్-అర్కం అనే మత శాఖను ప్రారంభించాడు. దీనిని 1994లో మలేషియా ప్రభుత్వం నిషేధించింది. 2010లో ఆషారీ మరణం తర్వాత ఈ వర్గం మళ్లీ ప్రచారం ప్రారంభించింది. ఇటీవల ఈ సమూహం ఇస్లామిక్ అథారిటీ పరిధిలోకి వచ్చింది. ఈ సమూహం మళ్లీ అల్-అర్కామ్ శాఖను ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.
అయితే, పిల్లల దోపిడీ ఆరోపణలను తిరస్కరిస్తూ గ్లోబల్ ఇఖ్వాన్ బిజినెస్ గ్రూప్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విచారణలో అధికారులకు సహకరిస్తామని ఇఖ్వాన్ గ్రూపు తెలిపింది. ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలతోనూ రాజీపడదని, ముఖ్యంగా తమ ఉద్యోగుల పిల్లలపై లైంగిక వేధింపుల వంటి కేసుల్లో కంపెనీ రాజీపడదని ప్రకటన పేర్కొంది. గ్లోబల్ ఇఖ్వాన్ గ్రూప్ వెబ్సైట్ ప్రకారం.. ఇది ఆహారం, పానీయాలు, మీడియా, వైద్యం, ప్రయాణం, ఆస్తి వంటి అనేక రకాల వ్యాపారాలలో తన ఉనికిని నమోదు చేస్తోంది. ఇఖ్వాన్ గ్రూప్లో ఐదు వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 20 దేశాలలో దాని స్వంత శాఖలను కలిగి ఉంది. ఇది లండన్, పారిస్, ఆస్ట్రేలియా, దుబాయ్లలో స్వంత హోటల్ చైన్లను కలిగి ఉంది.
Read Also:Lalitha Sahasranama Stotram: శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..