Site icon NTV Telugu

Mumbai Airport: తప్పిన పెను ప్రమాదం.. విమానాన్ని ఢీ కొట్టిన కార్గో వాహనం..!

Mumbai Airport

Mumbai Airport

Mumbai Airport: ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఒక ఘోర ప్రమాదం తప్పింది. ఢిల్లీకి వెళ్లాల్సిన అకాసా ఎయిర్‌లైన్స్ QP1410 విమానం, టేకాఫ్‌కు ముందు ఓ కార్గో కంటైనర్ వాహనం ఢీకొనడంతో విమానానికి, కార్గో వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే..

Read Also:Realme 15 Pro 5G: లాంచ్‌కు ముందే ఫీచర్స్ వెల్లడి.. 7,000mAh భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిస్ప్లే ఫీచర్లతో రాబోతున్న రియల్‌మీ 15 ప్రో..!

ఈ ఘటన సోమవారం తెల్లవారు జామున సుమారు 4:54 గంటలకు చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి వచ్చిన QP1736 విమానం ముంబయికి చేరుకుని బే A-7 వద్ద పార్క్ చేయబడింది. ఇదే విమానం తరువాత QP1410గా ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. అయితే, ప్రయాణికుల బోర్డింగ్‌కు ముందు కార్గో సంబధించిన పనులు కొనసాగుతున్న సమయంలో, BWFS (Bird Worldwide Flight Services) కు చెందిన ఓ కంటైనర్ వాహనం విమానం కుడి వైపు రెక్కను ఢీకొట్టింది.

Read Also:Air India crash: ఎయిర్ ఇండియా క్రాష్, “ఫ్యూయల్ స్విచ్‌”ల తనిఖీకి ఆదేశాలు..

ఈ ఘటనతో వెంటనే విమానాన్ని పరిశీలించిన అధికారులు, అది ప్రయాణానికి సురక్షితం కాదని గుర్తించారు. అందువల్ల Aircraft on Ground (AOG) గా ప్రకటించారు. తర్వాత అకాసా ఎయిర్‌లైన్స్ ప్రత్యామ్నాయంగా VT-VBB అనే మరో విమానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అది బే V17R వద్ద పార్క్ చేయబడి ఉండగా.. ప్రయాణికులను గేట్-29 నుండి బస్సుల ద్వారా కొత్త విమానానికి తీసుకువచ్చారు. ఈ ఘటన పెద్ద ప్రమాదానికి దారితీయకపోయినా, ఎయిర్‌సైడ్ సేఫ్టీ (Airside Safety) పై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశముండగా.. అకాసా ఎయిర్, విమానాశ్రయ అధికారులు సమయానికి స్పందించి విమానాన్ని మర్చి చర్యలు చేపట్టారు.

Exit mobile version