UPS: యుపీఎస్ పథకాన్ని ఆమోదించిన మొదటి రాష్ట్రం.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు పండగే!

  • ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూపీఎస్‌ పేరుతో కొత్త పింఛన్‌ పథకం
  • మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం
  • ఈ కేంద్ర పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర
Mh Govt

Mh Govt

కేంద్ర ప్రభుత్వం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రకటించిన ఒక రోజు తర్వాత.. మహారాష్ట్ర ప్రభుత్వం ఆదివారం రాష్ట్ర ఉద్యోగుల కోసం కూడా ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ కేంద్ర పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేసిన మొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఈ పథకానికి మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అటువంటి పరిస్థితిలో.. రాష్ట్రంలో కొత్త పెన్షన్ స్కీమ్ (NPS) బదులుగా యూపీఎస్ అమలుకు మార్గం సుగమం చేయబడింది.

READ MORE: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 వాహనాలు ధ్వంసం, ఐదుగురు మృతి

కాగా.. ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌(యూపీఎస్‌) పేరుతో కొత్త పింఛన్‌ పథకాన్ని శనివారం ప్రకటించింది. దీని ప్రకారం ఉద్యోగి తన పదవీ విరమణకు ముందు 12 నెలల్లో అందుకున్న బేసిక్‌ పే సగటులో 50 శాతం కచ్చితంగా పింఛన్‌ రూపంలో అందుతుంది. 23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కొత్త పింఛన్‌ పథకం వర్తిస్తుంది. 2004లో తీసుకువచ్చిన కొత్త పింఛన్‌ పథకాన్ని(ఎన్‌పీఎస్‌) రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2023 ఏప్రిల్‌లో కేంద్రం టీవీ సోమనాథన్‌ నేతృత్వంలో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు యూనిఫైడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను ప్రభుత్వం రూపొందించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించినట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రకటించారు.