NTV Telugu Site icon

Madhuri Dixit : రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న మాధురి దీక్షిత్?

Madhuri

Madhuri

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి అందరికీ తెలుసు.. అప్పట్లో సీనియర్ హీరోల సరసన నటించింది.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.. ఈ మధ్యకాలంలో కొన్ని షోలలో జడ్జిగా వ్యవహారిస్తుంది.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. అయితే ఈ ఎలక్షన్లలో కొందరు సినీ ప్రముఖులు కూడా పోటీ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అందులో ఈమె పోటి చెయ్యనుందని వార్తలు వినిపిస్తున్నాయి..

ముంబైలోని ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా తనపై వస్తోన్న రూమర్లకు మాధురీ దీక్షిత్ స్వయంగా సమాధానమిచ్చింది. మాధురీ దీక్షిత్ తన కొత్త మరాఠీ చిత్రం ‘పంచక్’ ప్రమోషన్‌లో బిజీగా ఉంది.. ఈ ప్రమోషన్ లో భాగంగా ఈమె రాజకీయాల్లోకి రానుందనే దానిపై క్లారిటి ఇచ్చింది.. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని, సినీ పరిశ్రమలో కొనసాగాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. ఎన్నికల సమయంలో నేను పోటీ చేస్తాననే ప్రచారంలోకి వస్తాయి. కానీ, నాకు రాజకీయాలు అసలు ఇష్టం లేదు.. సినిమాల్లోనే కొనసాగాలని అనుకుంటున్నా అని తేల్చి చెప్పింది..

1984లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌. ‘అబోద్’ ఆమె మొదటి . అప్పటికీ మాధురీకి ఇంకా 17 ఏళ్లే.. ‘తేజాబ్‌’ మాధురీ పాపులారిటీని పెంచింది. ఆ చిత్రంలోని ‘ఏక్ దో థీన్..’ పాట సూపర్ హిట్ అయింది. ఈ పాటలో మాధురి డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.. ఆ తర్వాత చేసిన సినిమాల్లో నటించి మెప్పించింది.. ఇప్పటికి ఈమెను సినిమాల్లో చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు..