Site icon NTV Telugu

Maa Elections: మరోసారి మా అధ్యక్షుడిగా మంచు విష్ణు.. ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ..!

16

16

మరోసారి ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును ఏకగ్రీవంగా ఎన్నుకున్న కమిటీ. ‘మా’ అసోసియేషన్ భవనం నిర్మించే వరకు మంచు విష్ణును అధ్యక్షుడిగా కొనసాగించాలని 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతీ రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ‘మా ‘ అసోసియేషన్ ఎన్నికలు., ఈసారి మాత్రం ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును ప్రకటించుకుంది కమిటీ. దింతో మరోసారి ‘ మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ను ఏకగ్రీవంగా కమిటీ ఎన్నుకుంది.

Also read: Off The Record: కడియం శ్రీహరి వర్సెస్ ఆరూరి రమేష్.. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపెవరిది ?

26 మంది కమిటీ సభ్యుల ఈ నిర్ణయంలో భాగంగా.. రఘు బాబు జెనరల్ సెక్రెటరీ, కరాటే కళ్యాణి జాయింట్ సెక్రటరీ, శివ బాలాజీ ట్రెజర్, ఈసీ మెంబెర్స్ గా మధుమిత, శైలజ, జై వాణిలు కొనసాగనున్నారు. ఇక ఈ నేపథ్యంలో విష్ణు పనితీరును లైఫ్ మెంబెర్స్ మెచ్చుకున్నారు. కాబట్టి 5 ఏళ్ల వరకు ‘మా’ అధ్యక్షుడిగా కొనసాగడం చరిత్రలో మొదటిసారి. కాబట్టి మరో 5 ఏళ్ల వరకు ‘మా’ ఎన్నికలు లేనట్లే. ఇకపోతే ప్రస్తుతం మంచు విష్ణు ‘భక్త కన్నప్ప’ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనేకమంది సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. 2021 లో జరిగిన ‘మా’ ఎన్నికలలో మంచు విష్ణు మొదటిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనారు.

Exit mobile version