Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని లక్నోలో, వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేశారు. అది కూడా రోగిని అపస్మారక స్థితికి చేరుకోకుండానే. ఆపరేషన్ సమయంలో రోగి ఫోన్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉన్నాడు. అదృష్టవశాత్తు ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. కళ్యాణ్ సింగ్ క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఇనిస్టిట్యూట్లో ఈ ప్రత్యేకమైన బ్రెయిన్ సర్జరీ జరిగింది. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్లోని న్యూరో సర్జరీ విభాగం చైర్మన్ డాక్టర్ విజేంద్ర కుమార్ మాట్లాడుతూ.. 56 ఏళ్ల రోగి హరిశంకర్ ప్రజాపతి తన కుటుంబంతో మా వద్దకు వచ్చాడు. హరిశంకర్ కొన్ని రోజులుగా తలనొప్పితో బాధపడుతున్నాడు. నొప్పి చాలా తీవ్రంగా ఉంది. అతనికి ఎడమ చేయి, కాలు చాలా బలహీనంగా ఉంది. రోగికి ఎంఆర్ఐ కూడీ తీశాం. అతడి మెదడులో కణితి ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణంగా రోగి తీవ్రమైన తలనొప్పి గురించి ఆస్పత్రిలో చేరారు.
Read Also:Kamareddy: బిల్లులు చెల్లించండి.. ప్రభుత్వ పాఠశాలకు తాళాలు వేసిన కాంట్రాక్టర్..
ఆపరేషన్ తర్వాత రోగికి పక్షవాతం వచ్చే అవకాశం ఉన్నందువల్ల అవేక్ క్రానియోటమీ అనే కొత్త సాంకేతికతను ఉపయోగించి రోగికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఇందులో రోగికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి బదులు ఆపరేషన్ చేసిన ప్రదేశాన్ని మాత్రమే మత్తుగా మారుస్తారు. ఈ టెక్నిక్తో ఆపరేషన్ చేయడం ద్వారా.. చేతులు, కాళ్ళ నరాలను రక్షించవచ్చు. రోగి, కుటుంబం నుండి సమ్మతి పొందిన తరువాత అతని ఆపరేషన్ జరిగిందని డాక్టర్లు తెలిపారు. ఆపరేషన్ సమయంలో రోగి తన చేతులు, కాళ్ళను కదిలిస్తూనే ఉన్నాడు. ఆపరేషన్ సమయంలో మొబైల్ ఫోన్లో రీళ్లను చూశాడు. తన చేతులు, కాళ్ళను నిరంతరం ఊపుతూనే ఉన్నారు. ఈ సమయంలో న్యూరోసర్జన్ సంక్లిష్ట శస్త్రచికిత్సలు చేయడంలో విజయం సాధించారు. ఇన్స్టిట్యూట్ మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ దేవాశిష్ శుక్లా మాట్లాడుతూ.. ఆపరేషన్ సమయంలో మొత్తం మెదడు మ్యాపింగ్ నరాల పర్యవేక్షణ యంత్రంతో జరిగింది. దీని కారణంగా చేయి, కాలు, నరాలను రక్షించడం ద్వారా కణితిని విజయవంతంగా తొలగించారు. ఈ ఆపరేషన్ విజయవంతం చేసినందుకు శుక్లా న్యూరోసర్జరీ బృందాన్ని అభినందించారు.
Read Also:Ravi Basrur : ఎన్టీఆర్ పై అభిమానం చాటుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్