Annamayya: ఘోర ప్రమాదం.. టెంపో ట్రావెలర్‌ను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

  • టెంపో ట్రావెలర్‌ను ఢీకొట్టిన లారీ
  • ముగ్గురు మృతి
Road Accident

Road Accident

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం దొమ్మన్న బావి వద్ద టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. తిరుమల నుంచి కర్ణాటక బాగేపల్లి వెళ్తున్న టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు చరణ్, మేఘర్ష్, శ్రావణి గా గుర్తించారు. డ్రైవర్ మంజునాథ్ తో సహా మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదఘటన పై ముదివేడు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.