Elections Results 2024: దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న రోజు రానే వచ్చింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు జరిగిన ఏడు విడతల జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. దేశంలోని మొత్తం 543 స్థానాల్లో 8360 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరి భవితవ్యం ఈ రోజుతో తేలిపోనుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈ సారి కూడా అధికారంలోకి వస్తుందని, 350కి పైగా సీట్ల సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తుండగా, ఇండియా కూటమి తామే అధికారంలోకి వస్తామని, ఎగ్జిట్ పోల్స్ తారుమారు అవుతాయని, తాము 295 సీట్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసింది. బీజేపీ స్వయంగా 370కి పైగా స్థానాలను, ఎన్డీయే కూటమి 400+ స్థానాలను గెలుచుకుంటుందని ఆ పార్టీ ఎన్నికల ముందు నుంచి చెబుతోంది.