Site icon NTV Telugu

Land Dispute Turns Violent: స్థల వివాదం.. ఐదుగురు మహిళలపై విచక్షణారహితంగా దాడి..

Land Dispute Turns Violent

Land Dispute Turns Violent

Land Dispute Turns Violent: ఓ స్థల వివాదం ముదిరి హత్యాయత్నానికి దారి తీసింది.. పట్ట పగలు అందరు చూస్తుండగానే కర్ర తో దాడి కీ పాల్పడి మహిళలను తీవ్రంగా గాయపరిచాడు.. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ దారుణం.. ఉప్పాడ చేపల దిబ్బడ పాలెం లో దోని నాగరాజు అనే వ్యక్తి రెచ్చిపోయాడు.. ఆస్తి తగాదాలు నేపథ్యంలో ఓ కుటుంబం కి చెందిన 5 గురు మహిళలు పై విచక్షణ రహితంగా దాడి చేశారు..తీవ్ర గాయలతో కేజీహెచ్ లో చేరారు మహిళలు మెరుగైన చికిత్స కోసం ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. సోషల్ మీడియాలో దాడి కి పాల్పడ్డ వీడియో లు వైరల్ కావడంతో హాట్ టాపిక్ గా మారాయి.. దాడికి పాల్పడిన దోని నాగరాజు బిజేపి నేత కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటు బాధితులు ఆరోపిస్తున్నారు..హత్యాయత్నంకు పాల్పడ్డ వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనీ రక్షణ కల్పించమని విశాఖ సిపిని కలవడానికి వచ్చారు బాధితులు..

Read Also: Mouli : మౌళి ‘దొంగనా కొడుకు’ : మైత్రి మూవీస్

Exit mobile version