డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ నుండి మూవీ ప్రొడక్షన్లోకి అడుగుపెట్టి.. సౌత్ స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కిస్తోన్నామని సంబరపడిపోయింది కన్నడ ప్రొడక్షన్ సంస్థ కెవిఎన్. కానీ ఆ సినిమాలు రిలీజ్ డేట్ దగ్గరకొచ్చే సరికి సంస్థకు వరుస తలనొప్పులు మొదలయ్యాయి. ముఖ్యంగా సెన్సార్ ఇష్యూస్ ప్రొడక్షన్ హౌస్ అధినేతలకు నిద్రలేకుండా చేస్తున్నాయి . మొన్న జననాయగన్.. ఇప్పుడు కేడీ కూడా ఇదే బాటలో నడుస్తోంది.
దళపతి విజయ్ లాస్ట్ మూవీగా చెప్పుకుంటోన్న జన నాయగన్పై భారీగా ఖర్చు పెట్టింది కెవిన్ ప్రొడక్షన్ హౌస్. సుమారు 400 కోట్లతో నిర్మించిన ఈ మూవీ ఈ ఏడాది జనవరిలో రిలీజ్ కావాల్సి ఉండగా… లాస్ట్ మినిట్లో సెన్సార్ ఇష్యూ వల్ల పోస్ట్ పోనైంది. సుప్రీంకోర్టులో కూడా తేలలేదు. ప్రజెంట్ సెన్సార్ రివైజింగ్ కమిటీ పరిశీలిస్తోంది. అంతలో మూవీ లీకై.. తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇక కేడీపై హోప్స్ పెట్టుకుంటే ఈ మూవీ కూడా సెన్సార్ ఇష్యూస్కి గురౌతోంది. ధ్రువ్ సర్జా, సంజయ్ దత్, శిల్పా శెట్టి కీ రోల్స్ చేసిన కేడీ ద డెవిల్ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ డేట్ లాకయ్యింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ.. కెవిఎన్ మరో ఫిల్మ్ టాక్సిక్ వాయిదా పడటంతో సడెన్లీ రేసులోకి వచ్చింది. ప్రేమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని ఐటమ్ సాంగ్ ఇటీవల వివాదాలకు కేంద్ర బిందువైంది. చివరకు పాటను యూట్యూబ్ నుండి తొలగించింది మూవీ టీం.
ఇక రిలీజ్ టైం దగ్గర పడుతోన్న టైంలో సెన్సార్ బోర్డ్ నుండి సమస్యలెదుర్కొంటోంది కేడీ మూవీ. ఇందులో వయలెన్స్ ఎక్కువ ఉందని ప్రాంతీయ బోర్డ్ A సర్టిఫికేట్ జారీ చేయడంతో పాటు స్పెషల్ సాంగ్లోని కొన్ని పదాలను మార్చాలని సజెస్ట్ చేసింది. కానీ సెంట్రల్ సెన్సార్ బోర్డ్ మాత్రం.. మూవీ టీంని కన్సిడర్ చేయకుండా రివైజింగ్ కమిటీకి పంపింది. దీనిపై ప్రేమ్ కాస్త అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ సినిమాపై పొలిటికల్ ఎటాక్ జరుగుమూవీదని కామెంట్ చేశారు. అలాగే కన్నడిగులు సైతం కెవిఎన్ సినిమాలను సెంట్రల్ బోర్డ్ టార్గెట్ చేస్తోందని విమర్శిస్తున్నారు. ఈ ఇష్యూ మధ్య కేడీ కూడా అనుకున్న టైంకి వస్తుందా రాదా అనే డౌట్ కలుగుతోంది.