KTR: “మైనింగ్లో భారీ అవినీతి జరిగింది”.. సభా సంఘం వేయాలని కేటీఆర్ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: మంత్రి కుటుంబం స్కామ్ బయట పెట్టే వరకు ప్రభుత్వం బిత్తర పోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి వాటా ఉన్నందుకు చర్య తీసుకోవడం లేదా? అని ప్రశ్నించారు. గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాటలాడారు. అక్రమ మైనింగ్ పై సభా సంఘం వేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ చేస్తున్న కంపెనీలో మంత్రి పాత్ర ఉందని ఆరోపించారు. ప్రభుత్వం వేసిన విచారణ సాఫీగా జరగాలని కోరుతున్నామన్నారు. విచారణ సాఫీగా జరగాలంటే మంత్రి రాజీనామా చేయాలన్నారు. అక్రమం జరిగింది వాస్తవమని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని.. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి దూరపు బంధువులది ముఖ్యమంత్రి అంటున్నారన్నారు. 2020- 22 వరకు పొంగులేటి ఛైర్మన్ అని తెలిపారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ను రేవంత్రెడ్డి పొంగులేటి కంపెనీకి ఇచ్చారని ఆరోపించారు. రెండున్నర ఏళ్లుగా ప్రజలకు పనికి వచ్చే ఒక పని కూడా చేయట్లేదని విమర్శించారు. మంత్రిగారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Also Read
- Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
- Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
- Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే "బీట్రూట్ హల్వా" ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
- IND Vs SL: టీమిండియాకు షాక్.. తొలి ఓవర్లోనే యశస్వి జైస్వాల్ డకౌట్..
మంత్రి కుటుంబన్ని ఎందుకు కాపాడుతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.. మైనింగ్ మంత్రి సిగ్గు పడాలన్నారు. “ఎన్ని కోట్ల ప్రజాధనం వృథా చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. భాగ్యలక్ష్మి మైనింగ్ కోకాపేట్లో ముఖ్యమంత్రి బంధువులది. రూ. 1800 కోట్లు ఆదాయం రావాలి. వస్తున్నది రూ. 900 కోట్లు. మిగతావి ఎవరి జేబులోకి పోతున్నవి. వేయి కోట్ల అవినీతి చేయకపోతే ఎందుకు సభను వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వం ఆడిస్తున్నట్టు బిజెపి ఆడుతుంది. ప్రవేట్ భూములలో గుండాలను వేసుకొని కబ్జా చేస్తున్న దాన్ని కూడా మేము వదిలిపెట్టం. మెట్రో పై స్టేట్మెంట్ చాలా తప్పుగా ఉంది. ముఖ్యమంత్రి సభలో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. 280 ఎకరాల ఎల్ అండ్ టీకి లీజుకి ఇచ్చాం. ఆ భూమి నీ కొట్టేయడానికి దండు పాల్యం బ్యాచ్ కుట్ర. వాటిని మీ అన్యాయాలకు కట్టబెడతారా..? రాయదుర్గం వద్ద మెట్రోకి కేంద్రం ఎందుకు అభ్యంతరం చెబుతోంది? ఎల్ అండ్ టీ Cfo నీ జైలులో వేస్తామని బెదిరించారు. ఇది పెద్ద కుంభకోణం. ప్రభుత్వం వినక పోతే గవర్నర్ను కూడా కలుస్తాం. గవర్నర్కి ఫిర్యాదు చేస్తాం.” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
- Tags
తాజావార్తలు
-
Virat Kohli: 18 ఏళ్ల క్రికెట్ ప్రయాణం.. విరాట్ కోహ్లీని ‘కింగ్’గా మార్చిన రికార్డ్ ఇదిగో.!
-
Anirudh – Kavya Maran Wedding : కావ్య మారన్ – అనిరుధ్ పెళ్ళికి వేదిక రెడీ?
-
Bus Stops Changed: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ఎఫెక్ట్.. ఆ ప్రదేశంలో బస్ స్టాప్స్ మార్పు..
-
This Week Theatrical Releases: పృథ్వీరాజ్ ‘ఖలీఫా పార్ట్ 1’ నుండి రవి తేజ ‘ఇరుముడి’ వరకు.. ఈ వారం థియేటర్లలో చూడాల్సిన సౌత్ సినిమాలు..
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!