Kollu Ravindra: ఉచిత బస్సు ప్రయాణం ఆగష్టు15 నుంచే.. ఆటో డ్రైవర్కు 10 వేలు!
- శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన
- త్వరలోనే అన్నదాత సుఖీభవ
- ఉచిత బస్సు ప్రయాణం ఆగష్టు15 నుంచే
- రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra about Free Bus Travel for Women in AP: మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణంకు ఆగష్టు 15న శ్రీకరం చుట్టబోతున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలో ప్రతి ఆటో డ్రైవర్కు రూ.10 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని పోర్టు త్వరలోనే పూర్తి కాబోతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కారణంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంను ఫైనాన్షియల్ హబ్గా చేయడానికి కార్యాచరణ చేస్తున్నాం అని, 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘సుపరిపాలన-తొలి అడుగులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల ఇళ్లు పరిశీలించాం. త్వరలోనే అన్నదాత సుఖీభవ అందించబోతున్నాం. విడతల వారీగా రూ.7000 చొప్పున రూ.20 వేలు రైతన్నలకు అందిస్తాం. మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆగష్టు 15వ తేదీన శ్రీకరం చుట్టబోతున్నాం. త్వరలో ప్రతి ఆటో డ్రైవర్కు రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. గుంతల మయమైన రోడ్లన్నీ సరిచేశాం. ఆంధ్రరాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పోర్టు త్వరలోనే పూర్తి కాబోతుంది. కార్గో ఎయిర్పోర్ట్కు కూడా కేంద్రవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ కొంతమంది నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమం చేపడుతున్నారు’ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
Also Read
- Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
‘రాష్ట్ర అభివృద్ధి జరగడం కొందరికి ఇష్టం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కారణంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏపీకి రాబోతున్నాయి. దిగ్గజ కంపెనీలు ఆంధ్రరాష్ట్రానికి రావడానికి ముందుకు వస్తుంటే.. వైసీపీ నాయకులు పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు. స్టీల్ ప్లాంట్, వెళ్లిపోయిన రైల్వే జోన్ను తీసుకొచ్చి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంను ఫైనాన్షియల్ హబ్గా చేయడానికి కార్యాచరణ చేస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. వైసీపీ స్కాంలు బయటపడుతున్నాయి. పలాసలో ఉన్న బోడికొండ, నల్లబొడ్లూరు కొండ కొల్లగొట్టిన అంశాలు తమ దృష్టికి వచ్చాయి’ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
తాజావార్తలు
-
Test Match: ఆఫ్ఘనిస్తాన్తో టెస్ట్ మ్యాచ్.. సిరాజ్ ఫిట్నెస్పై కోచ్ కీలక వ్యాఖ్యలు
-
Ameerpet Fire Accident : మెట్రో పిల్లర్కు క్రాక్.. క్లారిటీ ఇచ్చిన మెట్రో అధికారులు
-
World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
-
High Protein Roti Recipe: గోధుమ పిండిలో ఈ 3 పదార్థాలు కలపండి.. హై ప్రోటీన్ రోటీ రెడీ..
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!