Kollu Ravindra: ఉచిత బస్సు ప్రయాణం ఆగష్టు15 నుంచే.. ఆటో డ్రైవర్కు 10 వేలు!
- శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన
- త్వరలోనే అన్నదాత సుఖీభవ
- ఉచిత బస్సు ప్రయాణం ఆగష్టు15 నుంచే
- రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kollu Ravindra about Free Bus Travel for Women in AP: మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణంకు ఆగష్టు 15న శ్రీకరం చుట్టబోతున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలో ప్రతి ఆటో డ్రైవర్కు రూ.10 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని పోర్టు త్వరలోనే పూర్తి కాబోతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కారణంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏపీకి రాబోతున్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంను ఫైనాన్షియల్ హబ్గా చేయడానికి కార్యాచరణ చేస్తున్నాం అని, 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం అని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. నేడు శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి పర్యటించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే, కీలక నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘సుపరిపాలన-తొలి అడుగులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల ఇళ్లు పరిశీలించాం. త్వరలోనే అన్నదాత సుఖీభవ అందించబోతున్నాం. విడతల వారీగా రూ.7000 చొప్పున రూ.20 వేలు రైతన్నలకు అందిస్తాం. మహిళల ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆగష్టు 15వ తేదీన శ్రీకరం చుట్టబోతున్నాం. త్వరలో ప్రతి ఆటో డ్రైవర్కు రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. గుంతల మయమైన రోడ్లన్నీ సరిచేశాం. ఆంధ్రరాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని పోర్టు త్వరలోనే పూర్తి కాబోతుంది. కార్గో ఎయిర్పోర్ట్కు కూడా కేంద్రవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ కొంతమంది నాయకులు రెచ్చగొట్టే కార్యక్రమం చేపడుతున్నారు’ అని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు.
Also Read
- AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
- Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
- Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
- Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
‘రాష్ట్ర అభివృద్ధి జరగడం కొందరికి ఇష్టం లేదు. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కారణంగా ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఏపీకి రాబోతున్నాయి. దిగ్గజ కంపెనీలు ఆంధ్రరాష్ట్రానికి రావడానికి ముందుకు వస్తుంటే.. వైసీపీ నాయకులు పిచ్చిపిచ్చిగా వాగుతున్నారు. స్టీల్ ప్లాంట్, వెళ్లిపోయిన రైల్వే జోన్ను తీసుకొచ్చి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంను ఫైనాన్షియల్ హబ్గా చేయడానికి కార్యాచరణ చేస్తున్నాం. 20 లక్షల ఉద్యోగాల్లో భాగంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. వైసీపీ స్కాంలు బయటపడుతున్నాయి. పలాసలో ఉన్న బోడికొండ, నల్లబొడ్లూరు కొండ కొల్లగొట్టిన అంశాలు తమ దృష్టికి వచ్చాయి’ అని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
తాజావార్తలు
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
-
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
-
Colleges Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపు విద్యాసంస్థలు బంద్..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!