Kolakata Murder Case : మమతా బెనర్జీ విజ్ఞప్తిని తిరస్కరించిన బెంగాల్లోని జూనియర్ డాక్టర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kolakata Murder Case : కోల్కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో విధులు నిలిపివేసి రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఈ కారణంగా, మమతా బెనర్జీ కూడా తిరిగి పనిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. అయితే జూనియర్ ఆమె విజ్ఞప్తిని తిరస్కరించారు. బుధవారం తిరిగి విధుల్లో చేరాలన్న విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫోరం సభ్యుడు మాట్లాడుతూ ఆర్జి కర్ ఆసుపత్రి బాధిత మహిళా డాక్టర్కు న్యాయం జరిగే వరకు..వారి డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు ఆందోళన విరమించేది లేదని అన్నారు. ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ను ఆరోగ్య సేవల నుండి సస్పెండ్ చేయాలని, కోల్కతా పోలీస్ కమీషనర్పై కూడా అదే విధంగా చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు.
Read Also:CM Revanth Reddy : రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా అలైన్మెంట్ ఉండాలి
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
డిమాండ్లు సాధించే వరకు నిరసన
డాక్టర్ల ఫోరమ్ వారి డిమాండ్ల కోసం కోల్కతాలోని ఉత్తర భాగంలోని శ్యాంబజార్ ప్రాంతంలో ర్యాలీని కూడా చేపట్టింది. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫోరం సభ్యుడు మాట్లాడుతూ.. మా ఆందోళనకు ముఖ్యమంత్రి సహకరిస్తున్నారని తెలియడం సంతోషంగా ఉందన్నారు. మేము పనికి తిరిగి రావాలనుకుంటున్నాము, కానీ మా డిమాండ్లు ఇంకా నెరవేర్చబడనందున ఇది ప్రస్తుతం సాధ్యం కాదు. దీంతో పాటు కళాశాలల్లో ఎన్నికలు, వైద్య సదుపాయాలు, కార్యాలయాల్లో భద్రతా చర్యలకు సంబంధించిన అన్ని నిర్ణయాధికార కమిటీల్లో జూనియర్ డాక్టర్లు, విద్యార్థులు పాల్గొనాలని ఆందోళన చేస్తున్న వైద్యులు డిమాండ్ చేశారు.
Read Also:Off The Record : అందుకే నారాయణస్వామి అజ్ఞాత వాసమా..?
మమతా బెనర్జీ విజ్ఞప్తి
తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ నిర్వహించిన ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, డాక్టర్లు తమ సహోద్యోగికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నందున నేను మొదటి నుండి వారి పట్ల సానుభూతితో ఉన్నాను. ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మీ బాధ మాకు అర్థమైంది. కానీ దయచేసి ఇప్పుడు పనికి తిరిగి వెళ్లండి, ఎందుకంటే రోగులు చాలా బాధలో ఉన్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!