Kolkata Doctor Case : రక్తంతో తడిసి పోయిన డాక్టర్ ను చూశానంతే.. కోల్ కతా కేసులో నిందితుడు యూటర్న్
Kolkata Doctor Case : కోల్కతాలోని ప్రభుత్వ ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో 31 ఏళ్ల మహిళా డాక్టర్పై అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేసిన కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్ యూ-టర్న్ తీసుకున్నాడు. నిందితుడు సంజయ్రాయ్ తన న్యాయవాది కవితా సర్కార్తో మాట్లాడుతూ తాను నిర్దోషినని, ఇరికిస్తున్నట్లు చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా, ఆగస్ట్ 9 న జరిగిన ఈ దారుణ హత్య తర్వాత ఒక రోజు ఆగష్టు 10 న సంజయ్ రాయ్ను అరెస్టు చేశారు. సంఘటన జరిగిన సెమినార్ హాల్లో అతని బ్లూటూత్ హెడ్సెట్ కూడా కనుగొన్నారు.
సంజయ్ రాయ్ తరపు న్యాయవాది ప్రకారం.. పాలిగ్రాఫ్ పరీక్ష సమయంలో కూడా అతను తన నిర్దోషిత్వాన్ని కొనసాగించాడు. సంజయ్ రాయ్ను 10 ప్రశ్నలు అడిగారు. మహిళను హత్య చేసిన తర్వాత అతను ఏమి చేసాడు అనే ప్రశ్న కూడా ఇందులో ఉంది. ఆమెను హత్య చేయలేదని చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందని సీబీఐ అధికారులకు తెలిపాడు. సంజయ్ రాయ్ ఆసుపత్రిలోని సెమినార్ హాల్లోకి ప్రవేశించినప్పుడు, మహిళ అపస్మారక స్థితిలో ఉందని పాలిగ్రాఫ్ పరీక్షలో పేర్కొన్నాడు. ఆగస్టు 9న సెమినార్ హాల్లో రక్తంతో తడిసి ఉన్న మహిళను తాను చూశానని సంజయ్ పేర్కొన్నాడు. దీంతో తాను భయపడి గది నుంచి బయటకు పరుగులు తీశానని చెప్పాడు. బాధితురాలు తనకు తెలియదని కూడా సంజయ్ రాయ్ పేర్కొన్నాడు. అతడిని ఇరికిస్తున్నారని వాపోయాడు.
Also Read
Read Also:CM Chandrababu Review Meeting: మంత్రులు, అధికారులతో వరద పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష..
తాను నిర్దోషి అయితే పోలీసులకు ఎందుకు చెప్పలేదని రాయ్ ను ప్రశ్నించగా.. ఎవరూ నమ్మరని భయపడ్డానని రాయ్ చెప్పాడు. దోషి మరొకరై ఉండవచ్చని కవిత సర్కార్ మీడియాకు తెలిపింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్పై ఆసుపత్రి సెమినార్ హాల్లో అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఆమె 36 గంటల షిఫ్ట్ సమయంలో హాల్లో పడుకుంది. పోస్ట్మార్టంలో ఆమె శరీరంపై లైంగిక వేధింపులు, 25 బాహ్య, అంతర్గత గాయాలు కనుగొనబడ్డాయి.
సినీ దర్శకురాలు అపర్ణా సేన్తో పాటు బెంగాలీ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా ఆదివారం జరిగిన భారీ ర్యాలీలో వేలాది మంది ప్రజలతో కలిసి పాల్గొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరారు. మహామిచ్చిల్ ర్యాలీలో పలువురు సినీ ప్రముఖులు, నాయకవాదులు పాల్గొన్నారు. రద్దీగా ఉండే ఎస్ప్లానేడ్ ప్రాంతంలో ధర్నాకు దిగి న్యాయ, హల్లా బోల్ అంటూ నినాదాలు చేస్తూ సోమవారం ఉదయం వరకు అక్కడే ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. మహామిచ్చిల్ మినహా నగరంలో మరో రెండు చోట్ల ర్యాలీలు నిర్వహించారు. రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల పూర్వ విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. రెండవ ర్యాలీలో ప్రముఖ కాన్వెంట్ పాఠశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఉన్నారు. వీరందరూ డాక్టర్ (మరణించిన)కి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Read Also:Kichcha Sudeep: బిల్లా రంగా బాషా గా కిచ్చా సుదీప్.. కాన్సెప్ట్ వీడియో అదుర్స్..
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?