NTV Telugu Site icon

Health Tips : పరగడుపున కిస్ మిస్ ను తింటే ఏమౌతుందో తెలుసా?

Kissmiss

Kissmiss

డ్రై ఫ్రూట్స్ లలో కిస్ మిస్ కూడా ఒకటి.. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఎండు ద్రాక్షలను తింటే లావు అవుతారని చాలా మంది వాటిని తినకుండా ఉంటారు.. వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండుద్రాక్ష నానబెట్టిన నీరు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరం నుండి హానికరమైన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. కాలేయం, మూత్రపిండాలను బాగా ఉంచుతుంది. ఇది శరీరం నుండి మలినాలను కూడా తొలగిస్తుంది.. హిమోగ్లోబిన్‌ను పెంచే ఐరన్ ఉంటుంది..

ఖాళీకడుపుతో తీసుకోవడం వల్ల శరీరం నుండి హానికరమైన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. కాలేయం, మూత్రపిండాలను బాగా ఉంచుతుంది.. ఎముకలను బలోపేతం చేస్తుంది. రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది.. నానబెట్టిన వాటిని తినడం వల్ల పొట్ట శుభ్రం అవుతుంది.. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు రోజూ ఎనిమిది నుంచి పది నానబెట్టిన ఎండుద్రాక్షలను తినాలి. ఇందులో పొటాషియం, పీచు పుష్కలంగా ఉండటం వల్ల హై బీపి కంట్రోల్ అవుతుంది.. ఇంకా ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు అని నిపుణులు చెబుతున్నారు..

నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.