Bank Scam: ఏం తెలివిరా నాయనా.. బ్యాంక్నే బురిడీ కొట్టించారుగా..
- బ్యాంక్ ఉద్యోగితో కలిసి పన్నాగం..
- నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణం..
- వేలం వేసే క్రమంలో వెలుగులోకి మోసం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా ఏన్కూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (TGB) లో జరిగిన భారీ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కంచే చేను మేసిన చందంగా.. తాకట్టు పెట్టే బంగారాన్ని పరీక్షించి ధ్రువీకరించాల్సిన గోల్డ్ అప్రైజరే స్వయంగా నకిలీ నగలతో బ్యాంకును బురిడీ కొట్టించాడు.
కుట్ర ఎలా సాగిందంటే..?
ఈ కేసుకు సంబంధించి ఏన్కూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపాది సతీష్ (A1) అనే వ్యక్తి ఈ బ్యాంకులో గోల్డ్ అప్రైజర్గా పనిచేస్తున్నాడు. తన హోదాను అడ్డం పెట్టుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి పక్కా పథకం వేశాడు. తన భార్య శ్రీపాది మౌనిక (A2), అత్త రామచంద్రోజు జయమ్మ (A3), బావమరిది రామచంద్రోజు నరేశ్ (A4) లతో కలిసి 2024లో విడతల వారీగా సుమారు 242.25 గ్రాముల నకిలీ ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టించాడు. సతీష్ స్వయంగా వాటిని అసలైన బంగారంగా సర్టిఫై చేయడంతో, బ్యాంక్ అధికారులు ఏమాత్రం అనుమానించకుండా నిందితులకు రూ. 9.53 లక్షల గోల్డ్ లోన్ మంజూరు చేశారు.
Also Read
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
- OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
- Bangladesh: బంగ్లాదేశ్కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
మోసం బయటపడిందిలా..
రుణం తీసుకున్న నిందితులు గడువు ముగిసినా అసలు కానీ, వడ్డీ కానీ చెల్లించలేదు. దీంతో ఆ లోన్ అకౌంట్లు అన్నీ ఎన్పీఏ (NPA – నిరర్థక ఆస్తులు) గా మారిపోయాయి. బ్యాంకు నిబంధనల ప్రకారం బకాయిలు వసూలు చేసేందుకు అధికారులు ఆ ఆభరణాలను వేలం వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వేలం ప్రక్రియలో భాగంగా ఇతర నిపుణులతో బంగారాన్ని పునఃపరిశీలించగా, అవి కేవలం బంగారు పూత పూసిన నకిలీ నగలుగా తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.
ముగ్గురి అరెస్ట్ ..
బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ కేవీ ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, ఏన్కూరు ఎస్సై సంధ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు నలుగురూ కలిసి పథకం ప్రకారం బ్యాంకును మోసం చేసినట్లు నిర్ధారించారు.
నిందితులైన సతీష్ (గోల్డ్ అప్రైజర్), జయమ్మ, నరేశ్లను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. సతీష్ భార్య మౌనిక (A2) ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఏసీపీ వెల్లడించారు. బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినా.. నకిలీ పత్రాలు లేదా నకిలీ వస్తువులతో మోసాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
-
Samantha: బేబీ బంప్తో సమంత కొత్త ఫోటోలు.. ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతున్న సామ్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!