తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను అనుసంధానించే క్రమంలోనే గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ హైవే ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్నారు. అయితే సంక్రాంతి సమయంలో వామనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు ఈ హైవేపై తాత్కాలికంగా వాహనాలను అనుమతించారు. కొన్ని కారణాల వల్ల దీనిని మూసి వేయాల్సి వచ్చింది. అయితే ఈ హైవే పూర్తిగా వాహనదారులకు జూన్ నెలలో అందుబాటులలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Also Read:Telangana: బిగ్ షాక్.. ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు సస్పెండెడ్.. కారణం ఇదే..
దీనిని సుమారు రూ.4,451.87 కోట్ల వ్యయంతో, 162.4 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ హైటెక్ రహదారి పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి. భారత్ మాల పరియోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు, ఈ ఏడాది జూన్ నాటికి ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వారికి దూరం 80 కిలోమీటర్లు తగ్గడమే కాకుండా.. ప్రయాణం ఎంతో వేగవంతం అవుతుంది.
ఏఐ (AI) నిఘా కెమెరాలు, సోలార్ లైటింగ్, 10 ప్రధాన వంతెనలు, 98 అండర్ పాసులతో ఈ రహదారిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నాలుగు లైన్లుగా ఉన్న ఈ యాక్సెస్ కంట్రోల్ రహదారిని.. భవిష్యత్తులో ఆరు లైన్లకు పెంచుకునేలా డిజైన్ చేశారు. ఈ కారిడార్ వల్ల ఖమ్మం జిల్లాలో లాజిస్టిక్ హబ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పడి స్థానిక రైతులకు, వ్యాపారులకు మేలు చేకూరనుంది. అత్యాధునిక సదుపాయాలతో సిద్ధమవుతున్న ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.
