Kangana Ranaut: లేనిపోని చిక్కులను కొని తెచ్చుకుంటున్న కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: మండి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగాచేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. మొహర్రంకు సంతాపం తెలిపే ముస్లింల క్లిప్ను ఆమె రీపోస్ట్ చేశారు. హిందువులు కూడా అలాంటి యుద్ధానికి సిద్ధం కావాలంటూ పరోక్షంగా రాసుకొచ్చింది. కంగనా ట్వీట్పై ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. ముస్లింల ఈ వైఖరి భయానకంగా ఉందని కొందరు, కంగనా హిందువులను రెచ్చగొడుతోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నందున ఇలా ట్వీట్ చేయకూడదని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
Read Also:MLC 2024: అదరగొట్టిన స్టీవ్ స్మిత్.. ఛాంపియన్గా నిలిచిన వాషింగ్టన్ ఫ్రీడమ్..
Also Read
- FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్లోకి స్పెయిన్.!
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్వాష్ను భారత్ తప్పించుకుంటుందా.?
- Leopard: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం.. పరుగులు తీసిన భక్తులు
ఆ ట్వీట్లో కంగనా ఏం రాసింది?
కంగనా చేసిన పోస్టులో.. ఇది వింతగా, భయానకంగా ఉంది. కానీ ఈ రకమైన ప్రపంచంలో జీవించడానికి, హిందూ పురుషులు కూడా అలాంటి పోరాటానికి అవసరమైన శిక్షణ తీసుకోవాలా? వాతావరణం దృష్ట్యా రక్తం వేడి అయ్యే సమస్యే లేదు… ఉందా? క్లిప్లో కొందరు వ్యక్తులు కత్తితో తలపై కొట్టడం కనిపించింది. ప్రజల తలలు, బట్టలు రక్తంతో తడిసిపోయాయి.’ అంటూ రాసుకొచ్చారు. కంగనా పోస్ట్పై అనేక స్పందనలు కనిపిస్తున్నాయి. హిమాచల్ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. ఓ నెటిజన్ ఈ మహిళ హిందువులను రెచ్చగొడుతోంది. రక్తపాతంతో , హింసాత్మకంగా ఉండమని కోరుతోందని పేర్కొన్నాడు. మరొకరు నెటిజన్.. ఇది నిజంగా మంచిది కాదు. కానీ వారు ఇస్లాంలో దీన్ని చేయాలన్నారు. మరొక నెటిజన్ ఇది నిజంగా విచారకరమైన, భయానక దృశ్యంగా అభివర్ణించారు.

Read Also:Supreme Court: జార్ఖండ్ సీఎం హేమంత్ కు ఊరట..బెయిల్ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు
కంగనాకు నోటీసులు
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు నోటీసులు జారీ చేసింది. మండి సీటు నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్వాసి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కంగనా రనౌత్కు కోర్టు నోటీసు అందజేసింది. ఆగస్టు 21లోగా ఆమె తన స్పందనను తెలియజేయాలని కోరింది. మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్ను బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా రనౌత్ చేతిలో 74,755 ఓట్లతో ఓడిపోయారు. అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ లాయక్ రామ్ నేగి తాజాగా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్లోకి స్పెయిన్.!
-
Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
-
Yamaha FZ Flex Fuel: యమహా FZ Flex Fuel బైక్ విడుదల.. ఇప్పుడు E85 ఇంధనంతోనూ పరుగులు.. ధర, ఫీచర్లు ఇవే
-
Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
-
ENG vs IND Playing XI: నేడే చివరి టీ20.. వైట్వాష్ను భారత్ తప్పించుకుంటుందా.?
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!