Kangana Ranaut: లేనిపోని చిక్కులను కొని తెచ్చుకుంటున్న కంగనా
Kangana Ranaut: మండి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగాచేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. మొహర్రంకు సంతాపం తెలిపే ముస్లింల క్లిప్ను ఆమె రీపోస్ట్ చేశారు. హిందువులు కూడా అలాంటి యుద్ధానికి సిద్ధం కావాలంటూ పరోక్షంగా రాసుకొచ్చింది. కంగనా ట్వీట్పై ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. ముస్లింల ఈ వైఖరి భయానకంగా ఉందని కొందరు, కంగనా హిందువులను రెచ్చగొడుతోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నందున ఇలా ట్వీట్ చేయకూడదని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
Read Also:MLC 2024: అదరగొట్టిన స్టీవ్ స్మిత్.. ఛాంపియన్గా నిలిచిన వాషింగ్టన్ ఫ్రీడమ్..
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
ఆ ట్వీట్లో కంగనా ఏం రాసింది?
కంగనా చేసిన పోస్టులో.. ఇది వింతగా, భయానకంగా ఉంది. కానీ ఈ రకమైన ప్రపంచంలో జీవించడానికి, హిందూ పురుషులు కూడా అలాంటి పోరాటానికి అవసరమైన శిక్షణ తీసుకోవాలా? వాతావరణం దృష్ట్యా రక్తం వేడి అయ్యే సమస్యే లేదు… ఉందా? క్లిప్లో కొందరు వ్యక్తులు కత్తితో తలపై కొట్టడం కనిపించింది. ప్రజల తలలు, బట్టలు రక్తంతో తడిసిపోయాయి.’ అంటూ రాసుకొచ్చారు. కంగనా పోస్ట్పై అనేక స్పందనలు కనిపిస్తున్నాయి. హిమాచల్ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. ఓ నెటిజన్ ఈ మహిళ హిందువులను రెచ్చగొడుతోంది. రక్తపాతంతో , హింసాత్మకంగా ఉండమని కోరుతోందని పేర్కొన్నాడు. మరొకరు నెటిజన్.. ఇది నిజంగా మంచిది కాదు. కానీ వారు ఇస్లాంలో దీన్ని చేయాలన్నారు. మరొక నెటిజన్ ఇది నిజంగా విచారకరమైన, భయానక దృశ్యంగా అభివర్ణించారు.

Read Also:Supreme Court: జార్ఖండ్ సీఎం హేమంత్ కు ఊరట..బెయిల్ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు
కంగనాకు నోటీసులు
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు నోటీసులు జారీ చేసింది. మండి సీటు నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్వాసి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కంగనా రనౌత్కు కోర్టు నోటీసు అందజేసింది. ఆగస్టు 21లోగా ఆమె తన స్పందనను తెలియజేయాలని కోరింది. మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్ను బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా రనౌత్ చేతిలో 74,755 ఓట్లతో ఓడిపోయారు. అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ లాయక్ రామ్ నేగి తాజాగా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?