Kangana Ranaut: లేనిపోని చిక్కులను కొని తెచ్చుకుంటున్న కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: మండి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగాచేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. మొహర్రంకు సంతాపం తెలిపే ముస్లింల క్లిప్ను ఆమె రీపోస్ట్ చేశారు. హిందువులు కూడా అలాంటి యుద్ధానికి సిద్ధం కావాలంటూ పరోక్షంగా రాసుకొచ్చింది. కంగనా ట్వీట్పై ప్రజల నుంచి భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. ముస్లింల ఈ వైఖరి భయానకంగా ఉందని కొందరు, కంగనా హిందువులను రెచ్చగొడుతోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంపీగా ఉన్నందున ఇలా ట్వీట్ చేయకూడదని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
Read Also:MLC 2024: అదరగొట్టిన స్టీవ్ స్మిత్.. ఛాంపియన్గా నిలిచిన వాషింగ్టన్ ఫ్రీడమ్..
Also Read
- Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
ఆ ట్వీట్లో కంగనా ఏం రాసింది?
కంగనా చేసిన పోస్టులో.. ఇది వింతగా, భయానకంగా ఉంది. కానీ ఈ రకమైన ప్రపంచంలో జీవించడానికి, హిందూ పురుషులు కూడా అలాంటి పోరాటానికి అవసరమైన శిక్షణ తీసుకోవాలా? వాతావరణం దృష్ట్యా రక్తం వేడి అయ్యే సమస్యే లేదు… ఉందా? క్లిప్లో కొందరు వ్యక్తులు కత్తితో తలపై కొట్టడం కనిపించింది. ప్రజల తలలు, బట్టలు రక్తంతో తడిసిపోయాయి.’ అంటూ రాసుకొచ్చారు. కంగనా పోస్ట్పై అనేక స్పందనలు కనిపిస్తున్నాయి. హిమాచల్ పోలీసులను ట్యాగ్ చేస్తూ.. ఓ నెటిజన్ ఈ మహిళ హిందువులను రెచ్చగొడుతోంది. రక్తపాతంతో , హింసాత్మకంగా ఉండమని కోరుతోందని పేర్కొన్నాడు. మరొకరు నెటిజన్.. ఇది నిజంగా మంచిది కాదు. కానీ వారు ఇస్లాంలో దీన్ని చేయాలన్నారు. మరొక నెటిజన్ ఇది నిజంగా విచారకరమైన, భయానక దృశ్యంగా అభివర్ణించారు.

Read Also:Supreme Court: జార్ఖండ్ సీఎం హేమంత్ కు ఊరట..బెయిల్ నిర్ణయాన్ని సమర్థించిన కోర్టు
కంగనాకు నోటీసులు
హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు నోటీసులు జారీ చేసింది. మండి సీటు నుంచి పోటీ చేసేందుకు తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్వాసి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కంగనా రనౌత్కు కోర్టు నోటీసు అందజేసింది. ఆగస్టు 21లోగా ఆమె తన స్పందనను తెలియజేయాలని కోరింది. మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్య సింగ్ను బీజేపీ తరఫున పోటీ చేసిన కంగనా రనౌత్ చేతిలో 74,755 ఓట్లతో ఓడిపోయారు. అదే ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తప్పుడు కారణాలతో తిరస్కరించారని పేర్కొంటూ లాయక్ రామ్ నేగి తాజాగా కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రనౌత్ ఎన్నికను పక్కన పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!